యూఏఈ రూలర్స్ ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు
- July 06, 2016
యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, జబీల్ మాస్క్ వద్ద ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల్ని నిర్వహించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ, శాంతి, సహనం గురించి షేక్ మొహమ్మద్ సహా పలువురు ప్రముఖులు, ముస్లిం సోదరులు ఇమామ్ ప్రసంగాలను విని ఆనందించారు. ఇమామ్ ఈ సందర్భంగా 'రీడింగ్ నేషన్' క్యాంపెయిన్ గురించి ప్రస్తావించారు. ఎమిరేట్స్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారితో సంబంధాలను బలోపేతం చేసేందుకు 'రీడింగ్ నేషన్' ఉపయోగపడ్తుందని ఆయన చెప్పారు. యూఏఈ పాలకులకు అన్ని విధాలా అల్లా మంచి చేస్తాడని ఇమామ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా పలువురు ప్రముఖుల నుంచి షేక్ మొహమ్మద్ కృతజ్ఞతలు, ప్రశంసలు, గ్రీటింగ్స్ అందుకున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







