చర్చానీయాంశంగా మారిన డోనాల్డ్ ట్రంప్ ‘మూడోసారి’ ఎన్నిక
- April 07, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా దీనిపై యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీ స్పందించారు.మూడోసారి పోటీ చేయడానికి అవసరమైన చట్టపరమైన మార్గాన్ని కనుక్కోవడం కష్టమేనన్నారు.
రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా అవకాశాలు
“అధ్యక్షుడిగా ట్రంప్ను 20ఏళ్లపాటు కొనసాగించాలని కోరుకుంటున్నా. కానీ, ఈ పర్యాయం ముగిసిన తర్వాత ఆయనకు వేరే మార్గం లేదని అనుకుంటున్నా” అని యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీ పేర్కొన్నారు. ఫాక్స్న్యూస్తో మాట్లాడిన ఆమె, రాజ్యాంగ సవరణలు చేయడం ద్వారా అవకాశాలున్నప్పటికీ అది చాలా కష్టంతో కూడుకున్నదన్నారు. ట్రంప్ మూడోసారి ఎన్నిక అసాధ్యమేనంటూ అనేకమంది రాజ్యాంగ నిపుణులు చెబుతున్న వేళ ట్రంప్కు విధేయుల్లో ఒకరైన అటార్నీ జనరల్ ఇలా అనడం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి
అమెరికా అధ్యక్షుడిగా తాను మూడోసారి బాధ్యతలు చేపట్టడాన్ని తోసిపుచ్చలేమని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. ఈ విషయంలో తాను జోక్ చేయడం లేదని తెలిపారు. ఇందుకోసం కొన్ని మార్గాలు ఉన్నాయని, అయితే వాటిపై ఇప్పుడు ఆలోచించడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. మరోవైపు, అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండొంతుల రాష్ట్రాలు అంగీకరించాలి.
మరోవైపు, దేశాన్ని అధ్యక్షుడు ట్రంప్ నడిపిస్తున్న తీరు పై అమెరికా జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన తీరును నిరసిస్తూ దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. శనివారం న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తి ‘హ్యాండ్సాఫ్’ అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతి పెద్ద నిరసనగా ఇది నిలిచింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







