సింగపూర్ లో అగ్ని ప్రమాదం: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు
- April 08, 2025
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. సింగపూర్లో స్కూల్లో అగ్నిప్రమాదంలో సంభవించడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అంతేగాక, అతడి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది.
మార్క్ శంకర్ను స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. దీంతో పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ గిరిజనులను కలిశాక సింగపూర్ వెళ్తానని పవన్ అన్నారు. ఇవాళ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.
కాగా, పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో ఆయన పర్యటించి, గిరిజనులతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అడవితల్లి బాట ప్రోగ్రాంను ప్రారంభించారు.
పవన్ కల్యాణ్ ఇవాళ సుంకరమిట్టలో బ్రిడ్జిని ప్రారంభించాల్సి ఉంది. అలాగే, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వద్ద ఎకో టూరిజంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి, ఎకో టూరిజంపై ఆయన చర్చిస్తారు.
తాజా వార్తలు
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!







