ఈ నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే నిద్రలేమి దూరం...!
- April 10, 2025
రాత్రంతా హాయిగా పడుకుంటే దాని వల్ల రోజంతా ఎనర్జిటిక్గా ఉంటారు. అదే నిద్ర సరిగా లేకపోతే రోజంతా అలసట, నీరసంగా ఉండడమే కాకుండా జీర్ణ సమస్యలు మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. అందుకే, నిద్రలేమిని దూరం చేసుకునేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందులో ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి.
రాత్రుళ్లు పడుకునే ముందు అరికాళ్లకి ఆవనూనెని రాయడం వల్ల లాబాలున్నాయని చెబుతున్నారు. దీని వల్ల రక్తప్రసరణ సరిగా జరిగి పీరియడ్స్ నొప్పి తగ్గడం నుంచి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా మారుతుంది. వీటితో పాటు ఆవనూనె జీర్ణక్రియ, నిద్రలేమి సమస్యల్ని తగ్గిస్తుంది.
ఆవనూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల మనసు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఈ మసాజ్ వల్ల వాపు తగ్గుతుంది. శ్వాస తీసుకోవడంలో ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. ఈ మసాజ్ చేయడం వల్ల నేరుగా జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది.
ఆవనూనెతో అరికాళ్లని మసాజ్ చేస్తే అజీర్నం, నిద్రలేమి నుంచి కచ్చితంగా ఉపశమనం ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీనినే ఫాలో అవుతారు. నిపుణుల ప్రకారం, ఈ మసాజ్ వాయు మార్గాలని సడలిస్తుంది.ఇవి శ్వాసకోశ వ్యవస్థలో భాగమైన ప్రత్యేక గొట్టాలు. ఈ గొట్టాలు శ్వాసనాళం నుండి ఊపిరితిత్తులకి గాలిని తీసుకెళ్తాయి. ఈ వాయు మార్గాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు నిద్ర నాణ్యత మెరుగ్గా మారుతుంది.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







