హనుమాన్ జయంతి ఉత్సవాల రూట్ మ్యాప్ లను పరిశీలించిన కమిషనర్
- April 10, 2025
హైదరాబాద్: త్వరలో జరుగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు.ఈ రోజు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం, కొత్త పేట, చంపాపేట్, సింగరేణి కాలనీ, సరూర్ నగర్ లోని ట్యాంక్ బండ్ పోస్ట్ ఆఫీస్, గాంధీ విగ్రహం, దిల్సుఖ్ నగర్, సరస్వతి నగర్ వంటి ప్రాంతాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాల రూట్ మ్యాప్ లను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
రాచకొండ పరిధిలోని సున్నితమైన ప్రదేశాలలో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతియుతంగా ఊరేగింపులు జరిగేలా చూడాలని, భక్తులతో, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. మతసామరస్యానికి భంగం కలిగించే చర్యలను పోలిసు శాఖ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. భక్తులు, ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు.ఈ సందర్భంగా కమిషనర్ వెంట ఎల్.బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి నరసింహా రెడ్డి, డీసీపీ ట్రాఫిక్-2 శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







