'డోరా' హాస్యం, థ్రిల్లర్ చిత్రం
- July 07, 2016
మాయ'లో తన నటనతో నయనతార అందర్నీ భయపెట్టింది. ప్రస్తుతం తెలుగులో 'బాబు బంగారం', తమిళంలో 'తిరునాల్', 'కాష్మోరా', 'ఇరుముగన్'తోపాటు మొత్తం అయిదు సినిమాల్లో నటిస్తోంది. 'కళవాని', 'వాగైసూడవా'లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సర్గుణం ఇప్పుడు నిర్మాతగా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తారని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాకు 'డోరా' అని తాజాగా పేరు పెట్టారు. దాస్ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. 'మాయ' మాదిరిగానే హర్రర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హాస్యం, థ్రిల్లర్ కూడా ఉంటాయని సమాచారం. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. వివేక్శివ, మెర్విన్ సాలమన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. బుల్లితెరపై 'డోరా' కార్యక్రమం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అదే తరహాలో వారినీ ఆకర్షించేలా నయనతార పాత్ర ఉంటుందని సమాచారం
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







