వాహనదారులకు అలెర్ట్..ఇక AI-ఆధారిత కెమెరాలు ఫోకస్..!!
- April 13, 2025
మస్కట్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం రోడ్డు భద్రతకు ముప్పు కలిగించే ప్రధాన సవాళ్లలో ఒకటి. ఇది వాహనదారుల ప్రాణాలతోపాటు ఇతర వాహనదారులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాగా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం వంటి ఉల్లంఘనలను గుర్తించడానికి రాయల్ ఒమన్ పోలీసులు అధునాతన స్మార్ట్ సిస్టమ్లను అమలు చేయడం ప్రారంభించారని రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఇంజనీర్ అలీ బిన్ హమౌద్ అల్-ఫలాహి అన్నారు.
AI-ఆధారిత కెమెరాలు ఇప్పుడు పనిచేస్తున్నాయని, అవి ఫోటోలను సమర్థంగా విశ్లేషించగలవని తెలిపారు. అధిక ఖచ్చితత్వంతో ఉల్లంఘనలను గుర్తించగలవని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలు ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి సహాయపడతాయని, ఇప్పటికే వీటిని ఒమన్ రోడ్లపై విస్తృతంగా పరీక్షించినట్లు వివరించారు. ఇటువంటి సాంకేతికతలు ఉల్లంఘనలు, ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గిస్తాయని బ్రిగేడియర్ అల్-ఫలాహి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్