కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, విమాన టిక్కెట్లు, స్మార్ట్ఫోన్లు..!!
- April 13, 2025
యూఏఈ: దుబాయ్లోని బ్లూ-కాలర్ కార్మికులు అల్ క్వోజ్లో జరిగే కార్యక్రమంలో ఉచిత ఆరోగ్య పరీక్షలు, ప్రయాణ టిక్కెట్లు, ఇ-స్కూటర్లు, స్మార్ట్ఫోన్లతోపాటు మరిన్నింటిని గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) నిర్వహించిన 'ది హెల్త్ కార్నివాల్ ఫర్ ది వర్క్ఫోర్స్' దుబాయ్లోని పాకిస్తాన్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించబడుతోంది. ఉత్సవంలో భాగంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు, పింక్ కారవాన్తో కలిసి రొమ్ము క్యాన్సర్ తనిఖీలు, స్మార్ట్ లైఫ్తో భాగస్వామ్యంలో కంటి పరీక్షలు, అవగాహన సెషన్లు, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు, మ్యాజిక్ షోలు, ప్రయాణ టిక్కెట్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, స్మార్ట్ఫోన్ల వంటి విలువైన బహుమతులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి 10,000 మందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ ఉత్సవం 'ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ' చొరవలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ - దుబాయ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి







