కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, విమాన టిక్కెట్లు, స్మార్ట్ఫోన్లు..!!
- April 13, 2025
యూఏఈ: దుబాయ్లోని బ్లూ-కాలర్ కార్మికులు అల్ క్వోజ్లో జరిగే కార్యక్రమంలో ఉచిత ఆరోగ్య పరీక్షలు, ప్రయాణ టిక్కెట్లు, ఇ-స్కూటర్లు, స్మార్ట్ఫోన్లతోపాటు మరిన్నింటిని గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) నిర్వహించిన 'ది హెల్త్ కార్నివాల్ ఫర్ ది వర్క్ఫోర్స్' దుబాయ్లోని పాకిస్తాన్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించబడుతోంది. ఉత్సవంలో భాగంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు, పింక్ కారవాన్తో కలిసి రొమ్ము క్యాన్సర్ తనిఖీలు, స్మార్ట్ లైఫ్తో భాగస్వామ్యంలో కంటి పరీక్షలు, అవగాహన సెషన్లు, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు, మ్యాజిక్ షోలు, ప్రయాణ టిక్కెట్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, స్మార్ట్ఫోన్ల వంటి విలువైన బహుమతులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి 10,000 మందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ ఉత్సవం 'ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ' చొరవలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ - దుబాయ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









