కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, విమాన టిక్కెట్లు, స్మార్ట్ఫోన్లు..!!
- April 13, 2025
యూఏఈ: దుబాయ్లోని బ్లూ-కాలర్ కార్మికులు అల్ క్వోజ్లో జరిగే కార్యక్రమంలో ఉచిత ఆరోగ్య పరీక్షలు, ప్రయాణ టిక్కెట్లు, ఇ-స్కూటర్లు, స్మార్ట్ఫోన్లతోపాటు మరిన్నింటిని గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) నిర్వహించిన 'ది హెల్త్ కార్నివాల్ ఫర్ ది వర్క్ఫోర్స్' దుబాయ్లోని పాకిస్తాన్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించబడుతోంది. ఉత్సవంలో భాగంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు, పింక్ కారవాన్తో కలిసి రొమ్ము క్యాన్సర్ తనిఖీలు, స్మార్ట్ లైఫ్తో భాగస్వామ్యంలో కంటి పరీక్షలు, అవగాహన సెషన్లు, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు, మ్యాజిక్ షోలు, ప్రయాణ టిక్కెట్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, స్మార్ట్ఫోన్ల వంటి విలువైన బహుమతులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి 10,000 మందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ ఉత్సవం 'ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ' చొరవలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ - దుబాయ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







