అల్ నహ్దా భవనంలో అగ్నిప్రమాదం...ఐదుగురు మృతి..!!
- April 14, 2025
షార్జా: షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో .ఐదుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.మృతుడు 40 ఏళ్ల వయస్సు గల పాకిస్తానీ జాతీయుడని అధికారులు తెలిపారు.ఈ సంఘటనలో గాయపడిన వారు ప్రస్తుతం అల్ ఖాసిమి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని,వారి పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు షార్జా సివిల్ డిఫెన్స్ తెలిపింది.
భవనంలోని అద్దెదారులు తిరిగి రావడానికి అనుమతి కోసం వేచి ఉన్నారు. టవర్ పై రెండు అంతస్తులలో మొదటగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహారా సెంటర్కు ఎదురుగా ఉన్న ఈ భవనం ఎమిరేట్లోని ఎత్తైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.
షార్జాలోని పారిశ్రామిక ప్రాంతం 15లో ఉన్న పండ్లు,కూరగాయల గిడ్డంగిలో కూడా అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్