అల్ నహ్దా భవనంలో అగ్నిప్రమాదం...ఐదుగురు మృతి..!!
- April 14, 2025
షార్జా: షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో .ఐదుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.మృతుడు 40 ఏళ్ల వయస్సు గల పాకిస్తానీ జాతీయుడని అధికారులు తెలిపారు.ఈ సంఘటనలో గాయపడిన వారు ప్రస్తుతం అల్ ఖాసిమి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని,వారి పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు షార్జా సివిల్ డిఫెన్స్ తెలిపింది.
భవనంలోని అద్దెదారులు తిరిగి రావడానికి అనుమతి కోసం వేచి ఉన్నారు. టవర్ పై రెండు అంతస్తులలో మొదటగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహారా సెంటర్కు ఎదురుగా ఉన్న ఈ భవనం ఎమిరేట్లోని ఎత్తైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.
షార్జాలోని పారిశ్రామిక ప్రాంతం 15లో ఉన్న పండ్లు,కూరగాయల గిడ్డంగిలో కూడా అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







