అల్ నహ్దా భవనంలో అగ్నిప్రమాదం...ఐదుగురు మృతి..!!
- April 14, 2025
షార్జా: షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో .ఐదుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.మృతుడు 40 ఏళ్ల వయస్సు గల పాకిస్తానీ జాతీయుడని అధికారులు తెలిపారు.ఈ సంఘటనలో గాయపడిన వారు ప్రస్తుతం అల్ ఖాసిమి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని,వారి పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు షార్జా సివిల్ డిఫెన్స్ తెలిపింది.
భవనంలోని అద్దెదారులు తిరిగి రావడానికి అనుమతి కోసం వేచి ఉన్నారు. టవర్ పై రెండు అంతస్తులలో మొదటగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహారా సెంటర్కు ఎదురుగా ఉన్న ఈ భవనం ఎమిరేట్లోని ఎత్తైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.
షార్జాలోని పారిశ్రామిక ప్రాంతం 15లో ఉన్న పండ్లు,కూరగాయల గిడ్డంగిలో కూడా అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









