శ్రేయస్ అయ్యర్కు ప్రతిష్టాత్మక అవార్డు..
- April 15, 2025
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు అరుదైన గౌరవం లభించింది. మార్చి 2025 గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీతో అతడు పోటీపడ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ సభ్యులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్లో పాల్గొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరుపున శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. 243 పరుగులతో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
మార్చి నెలలో జరిగిన మూడు మ్యాచ్ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో 79 పరుగులు, సెమీస్లో ఆస్ట్రేలియా పై 45 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్పై 48 పరుగులు చేశాడు.
కాగా.. అయ్యర్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇది రెండో సారి. ఫిబ్రవరి 2022లో ఈ అవార్డును అయ్యర్ సొంతం చేసుకున్నాడు. టీమ్ఇండియా ఆటగాళ్లలో బుమ్రా, గిల్ లు మాత్రమే రెండు కంటే ఎక్కువ సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును అందుకోవడం పట్ల శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ గుర్తింపు ఎంతో ప్రత్యేకమైందన్నాడు.
తాజా వార్తలు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి
- నేడే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు…తరలి వస్తున్న ప్రపంచదేశాల అధినేతలు
- సౌదీ అరేబియా విజన్ 2030 వార్షిక నివేదిక..ప్రధాన లక్ష్యాలు పూర్తి..!!