కేదార్నాథ్ యాత్ర కోసం IRCTC హెలికాప్టర్ సర్వీసులు..
- April 15, 2025
కేదార్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కేదార్నాథ్ యాత్ర 2025 కోసం స్పెషల్ హెలికాప్టర్ సర్వీసులను ప్రకటించింది.
వచ్చే మే 2 నుంచి ప్రారంభమై మే 31 వరకు ప్రతిరోజూ హెలికాప్టర్ సర్వీసులను అందించనుంది. ఈ సర్వీసులను కేదార్నాథ్ యాత్రికులకు వేగంగా కేదార్నాథ్ ఆలయానికి చేర్చేందుకు ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఐఆర్సీటీసీ హెలికాప్టర్ సర్వీసులను అందిస్తోంది. మూడు ప్రదేశాల నుంచి హెలికాప్టర్ షటిల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఫాటా : రూ. 6,063 (రౌండ్ ట్రిప్)
సిర్సి : రూ. 6,061 (రౌండ్ ట్రిప్)
గుప్త్ కాశి : రూ. 8,533 (రౌండ్ ట్రిప్)
ఈ వాయుమార్గాల్లో హిమాలయాల మీదుగా మీరు ప్రయాణం చేయొచ్చు. ప్రయాణ సమయం తగ్గడమే కాదు.. రైల్వే మార్గంలో వెళ్లే విధంగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, బుకింగ్ ప్రక్రియ ఇలా:
- హెలికాప్టర్ టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు యాత్రికులు అధికారిక ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్ ద్వారా కేదార్నాథ్ యాత్రకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి.
- కొత్త వినియోగదారులు ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకోవాలి.
- ప్రయాణ వ్యవధి, ప్రయాణికుల సంఖ్య, ప్రయాణ తేదీలు వంటి ప్రయాణ వివరాలను అందించాలి.
- ఆపై యాత్ర రిజిస్ట్రేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- హెలియాత్ర పోర్టల్లో హెలికాప్టర్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఈ రిజిస్ట్రేషన్ లెటర్ చాలా అవసరం.
- ముందుగా హెలియాత్ర పోర్టల్లో వారి మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ ఉపయోగించి రిజిస్ట్రర్ చేసుకోవాలి.
- OTP వెరిఫై చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి.
- యాత్ర రిజిస్ట్రేషన్ నంబర్ను ఎంటర్ చేసి, ప్రయాణ తేదీలు, ప్రాధాన్య సమయ స్లాట్లు, ప్రయాణీకుల సంఖ్యను ఎంచుకుని పేమెంట్ పూర్తి చేయవచ్చు.
- ప్రతి యూజర్ రెండు టిక్కెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు.
- ప్రతి టికెట్లో గరిష్టంగా 6 ప్రయాణికులకు వసతి కల్పించవచ్చు.
- క్యాన్సిల్, రీఫండ్ ప్రాసెస్ ఇలా :
- ఒకవేళ మీ ప్లానింగ్ మారితే.. ప్రయాణికులు తమ బుకింగ్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. ఆ తర్వాత 5 నుంచి 7 వర్కింగ్ డేస్లో మీ డబ్బు రీఫండ్ అవుతుంది. అయితే, షెడ్యూల్ అయి బయలుదేరే 24 గంటలలోపు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ ఉండదని గమనించాలి.
ఈ సర్వీసులకు హై డిమాండ్ ఉన్నందున, యాత్రికులు తమకు ఇష్టమైన ప్రయాణ తేదీలు, సమయాలను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. తక్కువ సమయంలోనే అత్యంత సౌకర్యవంతమైన కేదార్నాథ్ యాత్రను పూర్తి చేయొచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







