వాహన దారులకు ఆబుదాబి పోలీసుల హెచ్చరిక.. ఢీకొన్న వాహనాలు..!!
- April 20, 2025
యూఏఈ: ఆబుదాబి పోలీసులు శనివారం హెచ్చరిక జారీ చేశారు. వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమ ఫోన్లను ఉపయోగించవద్దని హెచ్చరించారు. కొన్ని క్షణాల పరధ్యానం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తు పలు కార్లను ఢీకొన్న రెండు సంఘటనలను చూపించారు.
మొదటి సంఘటనలో, ఒక కారు వేగంగా వెళ్లి తన ముందు కాను ఢీకొనగా, అది వెళ్లి దాని ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. మరొక సంఘటనలో, ఒక కారు ఒక ప్రధాన రహదారిపై మరొక కారును ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి రోడ్డుపై జారిపడ్డాడు. దాంతో ఆ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనదారులు సురక్షితంగా డ్రైవ్ చేయాలని. రహదారి భద్రతా నియమాలను పాటించాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. యూఏఈలో ఇది తీవ్రమైన నేరమని, దీనికి 800 దిర్హంల వరకు ఫైన్ పడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









