వాహన దారులకు ఆబుదాబి పోలీసుల హెచ్చరిక.. ఢీకొన్న వాహనాలు..!!
- April 20, 2025
యూఏఈ: ఆబుదాబి పోలీసులు శనివారం హెచ్చరిక జారీ చేశారు. వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమ ఫోన్లను ఉపయోగించవద్దని హెచ్చరించారు. కొన్ని క్షణాల పరధ్యానం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తు పలు కార్లను ఢీకొన్న రెండు సంఘటనలను చూపించారు.
మొదటి సంఘటనలో, ఒక కారు వేగంగా వెళ్లి తన ముందు కాను ఢీకొనగా, అది వెళ్లి దాని ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. మరొక సంఘటనలో, ఒక కారు ఒక ప్రధాన రహదారిపై మరొక కారును ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి రోడ్డుపై జారిపడ్డాడు. దాంతో ఆ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనదారులు సురక్షితంగా డ్రైవ్ చేయాలని. రహదారి భద్రతా నియమాలను పాటించాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. యూఏఈలో ఇది తీవ్రమైన నేరమని, దీనికి 800 దిర్హంల వరకు ఫైన్ పడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









