వాహన దారులకు ఆబుదాబి పోలీసుల హెచ్చరిక.. ఢీకొన్న వాహనాలు..!!
- April 20, 2025
యూఏఈ: ఆబుదాబి పోలీసులు శనివారం హెచ్చరిక జారీ చేశారు. వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తమ ఫోన్లను ఉపయోగించవద్దని హెచ్చరించారు. కొన్ని క్షణాల పరధ్యానం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తు పలు కార్లను ఢీకొన్న రెండు సంఘటనలను చూపించారు.
మొదటి సంఘటనలో, ఒక కారు వేగంగా వెళ్లి తన ముందు కాను ఢీకొనగా, అది వెళ్లి దాని ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. మరొక సంఘటనలో, ఒక కారు ఒక ప్రధాన రహదారిపై మరొక కారును ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి రోడ్డుపై జారిపడ్డాడు. దాంతో ఆ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనదారులు సురక్షితంగా డ్రైవ్ చేయాలని. రహదారి భద్రతా నియమాలను పాటించాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు. యూఏఈలో ఇది తీవ్రమైన నేరమని, దీనికి 800 దిర్హంల వరకు ఫైన్ పడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







