హైదరాబాద్ లో దారుణం
- April 28, 2025
హైదరాబాద్: హిమాయత్ నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు భవనంలో జరిగిన హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక రద్దీ ప్రాంతంలో ముఖ్యమైన వాణిజ్య భవనంలో లిఫ్ట్లో మృతదేహం లభించడం ప్రజల్లో భయాందోళనలు పెంచింది.గుర్తు తెలియని దుండగులు లిఫ్ట్లో మృతదేహాన్ని వదిలి వెళ్లారు.నిత్యం జనావాసులు ఉండే ప్రాంతంలో హత్య జరగడంతో పోలీసులు విచారణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు శ్రమిస్తోంది. మృతుడి వివరాల కోసం విచారణ కొనసాగుతోంది. మృతుడి సంబంధాలు, శత్రువుల ఫై విచారణ జరుగుతోంది. హత్య ఎక్కడ జరిగింది, మృతదేహాన్ని ఎలా లిఫ్ట్లో ఉంచారనే అంశాలపై స్పష్టత రాబట్టేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో భవనాల్లో భద్రతా ప్రమాణాల నిర్వహణపై నగర పోలీసుల నుండి కీలక మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.
సమాజంలో భద్రతపై ప్రశ్నలు
హిమాయత్ నగర్ వంటి కేంద్ర ప్రాంతంలో ఇలా దారుణమైన ఘటన జరగడం భద్రతా ప్రమాణాలపట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధానంగా బ్యాంకుల వంటి ప్రదేశాల్లో భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ సంఘటన ప్రభుత్వ యంత్రాంగానికి ఒక హెచ్చరికగా మారింది. ప్రజా ప్రదేశాల్లో భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని హామీ ఇస్తున్నా, దీని నుంచి తీసుకునే బుద్ధి పాఠం నగర భద్రతా విధానాలను పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని తేలుస్తోంది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!