హోటళ్లలో చెక్-ఇన్ కోసం ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీ.. అబుదాబిలో అమలు..!!
- April 29, 2025
యూఏఈ: సందర్శకులు, నివాసితులు, ఉద్యోగుల భద్రత కోసం అబుదాబిలోని అన్ని హోటళ్లలో ఫేస్-రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేయనున్నారు. ఫేస్-రికగ్నిషన్ వ్యవస్థ గెస్టులు, సందర్శకుల చెక్-ఇన్ సమయంలో బయోమెట్రిక్ డేటాను తీసుకుంటుందని, అనంతరం దానిని విశ్లేషిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. డేటా సురక్షితంగా ఎన్క్రిప్ట్ చేయబడుతుందని, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) ద్వారా మ్యాచ్ చేసి, దానిని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుదాబి నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్కు కనెక్ట్ చేస్తుందన్నారు.
యూఏఈ సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యతా నిబంధనలకు అనుగుణంగా, చట్టపరమైన, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అతిథుల భద్రతను మెరుగుపరచడాని, హోటల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఈ డేటా ప్రత్యేకంగా ఉపయోగించబడుతుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ఇప్పుడు ఎమిరేట్లోని కొన్ని ఎంపిక చేసిన హోటళ్లలో పైలట్ దశలో విజయవంతంగా అమలు అవుతుందన్నారు. పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే మొదటి దశలో భాగంగా అబుదాబి నగరంలోని ఫైవ్ స్టార్స్ హోటళ్లు, అల్ ఐన్ ప్రాంతం, అల్ దఫ్రా ప్రాంతంలో ప్రారంభమవుతుందని తెలిపారు. తరువాత రెండవ దశ ఫోర్ స్టార్స్ హోటళ్లలో..క్రమంగా మిగిలిన అన్ని హోటల్స్ కు విస్తరిస్తామన్నారు.
యూఏఈ రాజధానిలోని హోటళ్ళు Dh2.3 బిలియన్ ($626 మిలియన్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 18 శాతం పెరుగుదల నమోదైంది. మరియు అందుబాటులో ఉన్న గదికి ఆదాయం (RevPAR) Dh484 కు చేరుకుంది, ఇది సంవత్సరానికి 25 శాతం పెరుగుదల అని పేర్కొన్నారు. ఈ కాలంలో హోటల్ ఆక్యుపెన్సీ అధిక స్థాయిలను కొనసాగించిందని, రమదాన్ తో సహా, ఎమిరేట్ అంతటా 79 శాతం నమోదు చేసిందన్నారు. పర్యాటక రంగం 2025లో ఆర్థిక వ్యవస్థకు Dh62 బిలియన్లను అందించనుందని, ఇది 2024 నుండి 13 శాతం పెరుగుదల కాగా, 2025లో ఎమిరేట్ అంతటా 255,000 ఉద్యోగాలకు మద్దతు ఇస్తుందని తెలిపారు.
నంబియో భద్రతా సూచిక ద్వారా అబుదాబి ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్ పొందిందని DCT అబుదాబిలో పర్యాటక డైరెక్టర్ జనరల్ సలేహ్ మొహమ్మద్ అల్ గెజిరీ వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







