కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..

- April 30, 2025 , by Maagulf
కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..

కోల్‌కతా: కోల్‌కతాలో విషాదం చోటు చేసుకుంది. బారా బజార్ ప్రాంతంలోని మచ్చువా ఫాల్ మండి సమీపంలో రితురాజ్ హోటల్ లో మంగళవారం రాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 14మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ అగ్నిప్రమాదం గురించి మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి 8.15గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించిందని చెప్పారు. ఈ ప్రమాదం నుంచి ఇప్పటి వరకు 14మంది మృతిచెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మంటలు ఎలా సంభవించాయనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. అయితే, హోటల్ లో మంటలు పెద్దెత్తున వ్యాపించడంతో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు భవనంపై నుంచి దూకేశారు. ఆ సమయంలో అగ్నిమాపక బృందం అక్కడికి చేరుకొని పలువురి ప్రాణాలను కాపాడారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com