అయోధ్య రామాలయంలో బంగారు కలశం ఏర్పాట్లు
- May 02, 2025
అయోధ్య: అయోధ్యలో నిర్మాణంలో ఉన్న భవ్య రామాలయ శిఖరంపై బంగారు తాపడం చేసిన కలశాన్ని త్వరలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కలశం 20 గేజ్ రాగి షీటుతో తయారుచేసి, దానిపై బంగారు పూత వేయబడుతోంది. రామ భక్తులు కోరుకున్నట్లుగానే, ఆలయ శిఖరంపై ఈ బంగారు కలశాన్ని ప్రతిష్ఠించబోతున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. భక్తుల కల త్వరలోనే నెరవేరబోతోందని ఆయన ప్రకటించారు.ఇక రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ మొదటి అంతస్తులో రామ దర్బార్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇందులో బంగారు తలుపును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వివరాలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
రామ దర్బార్లో ఉన్న విగ్రహాలు ఈ నెలలో రావచ్చని ఆయన చెప్పారు. రామ మందిరంలో నిర్మించబోయే ఏడు మండపాల పనులు త్వరలో పూర్తయ్యే అవకాశముంది.అలాగే ఆలయ ప్రాంగణంలోని ఇతర నిర్మాణాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఈశాన్య భాగంలో శివాలయం నిర్మాణం జరుగుతుండగా, నైరుతి దిశలో రామ మందిర సంబంధిత నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రాకార నిర్మాణం సహా ఇతర భాగాల్లో పనులు తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు తిలకించదగ్గ స్థలంగా అయోధ్య రామాలయం రూపుదిద్దుకుంటుండడం రామ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







