ఎలక్ట్రిక్ బస్సులు..మొదటి సౌదీ నగరంగా నిలిచిన తబుక్..!!
- May 07, 2025
తబుక్: పబ్లిక్ బస్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మొట్టమొదటి సౌదీ నగరంగా తబుక్ నిలించింది. తబుక్ ప్రాంత ఎమిర్ ప్రిన్స్ ఫహద్ బిన్ సుల్తాన్ ఈ మేరకు బస్సులను మంగళవారం ప్రారంభించారు.
ఆధునిక బస్ నెట్వర్క్ నగరం అంతటా.. మొత్తం 136 కిలోమీటర్ల ఐదు ప్రధాన మార్గాలను కవర్ చేస్తుంది. 90 మంది శిక్షణ పొందిన సౌదీ డ్రైవర్లు, సిబ్బందితో 30 అధునాతన బస్సులను నడుపనున్నారు. మొత్తం 106 స్టేషన్లు కీలకమైన నివాస, వాణిజ్య, పరిపాలనా కేంద్రాలను కవర్ చేస్తాయి. సౌదీ విజన్ 2030 విస్తృత లక్ష్యాలలో భాగంగా ఈ రవాణా ప్రాజెక్టు ఒకటని ఎమిర్ ప్రిన్స్ అన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రజా రవాణాలో "గుణాత్మక ముందడుగు" అని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్ అన్నారు. 2024లో 15 నగరాల్లో 104 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఇలాంటి బస్సు నెట్వర్క్లను ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. టబుక్ ప్రాజెక్ట్ను SAPTCO నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







