ఎలక్ట్రిక్ బస్సులు..మొదటి సౌదీ నగరంగా నిలిచిన తబుక్..!!
- May 07, 2025
తబుక్: పబ్లిక్ బస్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మొట్టమొదటి సౌదీ నగరంగా తబుక్ నిలించింది. తబుక్ ప్రాంత ఎమిర్ ప్రిన్స్ ఫహద్ బిన్ సుల్తాన్ ఈ మేరకు బస్సులను మంగళవారం ప్రారంభించారు.
ఆధునిక బస్ నెట్వర్క్ నగరం అంతటా.. మొత్తం 136 కిలోమీటర్ల ఐదు ప్రధాన మార్గాలను కవర్ చేస్తుంది. 90 మంది శిక్షణ పొందిన సౌదీ డ్రైవర్లు, సిబ్బందితో 30 అధునాతన బస్సులను నడుపనున్నారు. మొత్తం 106 స్టేషన్లు కీలకమైన నివాస, వాణిజ్య, పరిపాలనా కేంద్రాలను కవర్ చేస్తాయి. సౌదీ విజన్ 2030 విస్తృత లక్ష్యాలలో భాగంగా ఈ రవాణా ప్రాజెక్టు ఒకటని ఎమిర్ ప్రిన్స్ అన్నారు.
ఈ ప్రాజెక్టును ప్రజా రవాణాలో "గుణాత్మక ముందడుగు" అని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్ అన్నారు. 2024లో 15 నగరాల్లో 104 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఇలాంటి బస్సు నెట్వర్క్లను ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. టబుక్ ప్రాజెక్ట్ను SAPTCO నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









