బందరు పోర్టు నిర్మాణం కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నం--మంత్రి కొల్లు

- July 09, 2016 , by Maagulf
బందరు పోర్టు నిర్మాణం కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నం--మంత్రి కొల్లు

బందరు పోర్టు నిర్మాణం కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నమని, పోర్టు కలను సీఎం చంద్రబాబు నిజం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పోర్టును పక్కన పెట్టారని ఆరోపించారు. 28 గ్రామాల్లోని భూములను భూసమీకరణ కింద తీసుకుంటామని, రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన ప్యాకేజ్ ఇస్తామని ఆయన తెలిపారు. 4800 ఎకరాల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపడుతామన్నారు. మిగిలిన స్థలంలో పరిశ్రమలు నిర్మిస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com