జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం..
- May 08, 2025
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లో జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం అయ్యారు. భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు అజార్ స్థావరం సైతం ధ్వంసం అయింది. కందహార్లో IC-814 ఫైట్ను హైజాక్ చేయడంలో అబ్దుల్ రవూఫ్ అజార్ పాత్ర పోషించారు. అంతర్జాతీయ జిహాదీ నెట్ వర్క్లలోనూ అజార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. వారిలో అబ్దుల్ రవూఫ్ అజార్ ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. జైషేను స్థాపించిన మసూద్ అజార్ సోదరుడే అబ్దుల్ రవూఫ్ అజార్. జమ్మూకాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో అజార్ కీలకంగా ఉండటంతో మోస్ట్ వాంటెడ్గా మారారు.
పాకిస్థాన్ బహవల్ పూర్లో జైషే కార్యాలయంపై భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందగా.. అబ్దుల్ రవూఫ్ అజార్ గాయపడ్డారు. చికిత్స పొందుతూ గురువారం అజార్ కన్నుమూసినట్లు తెలుస్తోంది.
కాగా పహల్గాం ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం ఉగ్రస్థావరాలపై బాంబులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 9 శిబిరాలు ధ్వంసం అయ్యాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఆపరేషన్ సింధూర్ గురువారం కూడా కొనసాగింది. దీంతో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అయినట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







