వైద్యుడిని మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష.. భారీ జరిమానా..!!
- May 09, 2025
దుబాయ్: వైద్య పార్టనర్ షిప్ పేరిట అరబ్ వైద్యుడి నుండి నిధులను దుర్వినియోగం చేసినందుకు దోషిగా తేలిన 48 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి దుబాయ్ మిస్డిమీనర్స్ కోర్టు ఒక నెల జైలు శిక్ష, 600,000 దిర్హామ్ల జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత కోర్టు అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. ఈ కేసు గత సంవత్సరం మే నెలలో నమోదైంది. దుబాయ్లో 600,000 దిర్హామ్ల అంచనా పెట్టుబడితో మల్టీ-స్పెషాలిటీ మెడికల్ సెంటర్ను స్థాపించడంలో భాగస్వామిగా ఉండాలనే ప్రతిపాదనతో ఆ వ్యక్తి ప్రతిపాదన చేసి అనంతరం మోసం చేశాడు.
దుబాయ్లో జరిగిన ఒక వైద్య ప్రదర్శన కలిసాడని, ఓ వెంచర్ ప్రతిపాదన చేసి, ప్రారంభ చెల్లింపుగా Dh400,000, ఆ తర్వాత మరొక Dh200,000 అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయితే, నిధులు అందిన తర్వాత, ప్రాజెక్ట్ అతీగతి లేదని, డబ్బు తిరిగి చెల్లించడానికి నిరాకరించాడని ఆరోపించారు. దీనితో బాధితుడు అధికారులను సంప్రదించి అధికారికంగా ఫిర్యాదును దాఖలు చేశాడు. నిందితుడు డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాడని అధికారులు గుర్తించి, కోర్టుకు నివేదిక సమర్పించారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







