అల్ మక్తూమ్ విమానాశ్రయంలో సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్..!!
- May 10, 2025
దుబాయ్ : అల్ మక్తూమ్ అంతర్జాతీయ (DWC) విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణీకులు స్మార్ట్ కారిడార్ ద్వారా కేవలం సెకన్లలో ఇమ్మిగ్రేషన్ను క్లియర్ చేసుకోవచ్చు. దుబాయ్ విమానాశ్రయం (DXB) ఇమ్మిగ్రేషన్ స్మార్ట్ గేట్ల గుండా ఒక వ్యక్తి వెళ్ళే సమయంలో, 10 మంది ప్రయాణికులు కారిడార్ గుండా వెళ్ళవచ్చని ఎమిరేట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు. దుబాయ్లో జరిగిన ది ఎయిర్పోర్ట్ షోలో ఆయన తెలిపారు. గతంలో పాస్పోర్ట్ తనిఖీలు, స్టాంపింగ్ విధానాలు ఉన్నాయని, ఇప్పుడు, అన్ని పాస్పోర్ట్లు కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి ఆటోమెటిక్ గా ప్రోగ్రామ్ చేయబడి ధృవీకరించబడతాయని పేర్కొన్నారు. DXB ఇప్పటికీ పిల్లల కోసం ప్రత్యేక కౌంటర్లు, తల్లులు, వృద్ధ ప్రయాణీకులకు ప్రాధాన్యతనిచ్చే సేవలతో వ్యక్తిగత అవసరరాలు ఉన్నవారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని, వారికి ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. అదే సమయంలో ప్యాసింజర్లు లగేజీ నిర్వహణ కూడా ఆటోమేటెడ్ అవుతుందని అధికారులు వెల్లడించారు.
దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (DAEP)లోని ఫ్యూచర్ ఆఫ్ థింగ్స్ సీనియర్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ షంసి ఒక ప్రెజెంటేషన్లో ప్రయాణీకులు తమ కార్లలో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, ఆటోగా రోబోలు బాధ్యత వహిస్తాయని వివరించారు. వాహనం నుండి లగేజీని నేరుగా చెక్-ఇన్ కౌంటర్కు బదిలీ చేయవచ్చని పేర్కొంది.
ప్రయాణికులు యాప్ ద్వారా తమ విమానాలను బుక్ చేసుకోవచ్చని, విమానాశ్రయం డ్యూటీ ఫ్రీ నుండి షాపింగ్ చేయవచ్చు అని తెలిపారు. తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసిన వెంటనే విమానాశ్రయ మెటావర్స్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుల బ్యాగులకు ఇ-ట్యాగ్ జారీ అవుతుందని , ఈ సర్వీసును అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. "ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్" విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో వాహనాలను ట్రాక్ చేస్తుందని, విమానయాన సంస్థలు వచ్చే ప్రయాణీకుల కోసం సిద్ధం కావడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







