తెలంగాణ: నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం

- May 13, 2025 , by Maagulf
తెలంగాణ: నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం

హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు సమాచార హక్కు(RTI) కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస్, పర్వీన్ మొహిసిన్ , దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆర్టీఐ కమిషనర్లుగా నియమితులయ్యారు. ఇప్పటికే ఛీఫ్ కమిషన్ గా(RTI) ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 5న ప్రభుత్వం ఏడుగురి పేర్లను రికమండ్ చేస్తూ గవర్నర్ కు లేఖ రాసింది. వారిలో కప్పర హరి ప్రసాద్, రాములు, వైష్ణవి పేర్లు లేవు. మొదట పంపిన జాబితాలో పీవీ శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్య రెడ్డి, పర్వీన్ మొహిసిన్ పేర్లు మాత్రమే ఉన్నాయి. దేశాల భూపాల్ పేరుకొత్తగా చేరింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై గవర్నర్ తో చర్చించినట్టు ప్రచారం జరిగిన గంటల వ్యవధిలో ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే పాత వారిని జాబితాలోంచి తొలగించారా..? లేక ఆపారా..? అన్నది తెలియాల్సి ఉంది.

రాష్ట్రంలో నలుగురు సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస్, పర్వీన్ మొహిసిన్ , దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆర్టీఐ కమిషనర్లుగా నియమితులయ్యారు. ఇప్పటికే ఛీఫ్ కమిషన్ గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 5న ప్రభుత్వం ఏడుగురి పేర్లను రికమండ్ చేస్తూ గవర్నర్ కు లేఖ రాసింది. వారిలో కప్పర హరి ప్రసాద్, రాములు, వైష్ణవి పేర్లు లేవు. మొదట పంపిన జాబితాలో పీవీ శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్య రెడ్డి, పర్వీన్ మొహిసిన్ పేర్లు మాత్రమే ఉన్నాయి. దేశాల భూపాల్ పేరుకొత్తగా చేరింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై గవర్నర్ తో చర్చించినట్టు ప్రచారం జరిగిన గంటల వ్యవధిలో ఉత్తర్వులు వెలువడ్డాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com