తెలంగాణ: నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం
- May 13, 2025
హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు సమాచార హక్కు(RTI) కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస్, పర్వీన్ మొహిసిన్ , దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆర్టీఐ కమిషనర్లుగా నియమితులయ్యారు. ఇప్పటికే ఛీఫ్ కమిషన్ గా(RTI) ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 5న ప్రభుత్వం ఏడుగురి పేర్లను రికమండ్ చేస్తూ గవర్నర్ కు లేఖ రాసింది. వారిలో కప్పర హరి ప్రసాద్, రాములు, వైష్ణవి పేర్లు లేవు. మొదట పంపిన జాబితాలో పీవీ శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్య రెడ్డి, పర్వీన్ మొహిసిన్ పేర్లు మాత్రమే ఉన్నాయి. దేశాల భూపాల్ పేరుకొత్తగా చేరింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై గవర్నర్ తో చర్చించినట్టు ప్రచారం జరిగిన గంటల వ్యవధిలో ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే పాత వారిని జాబితాలోంచి తొలగించారా..? లేక ఆపారా..? అన్నది తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో నలుగురు సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస్, పర్వీన్ మొహిసిన్ , దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆర్టీఐ కమిషనర్లుగా నియమితులయ్యారు. ఇప్పటికే ఛీఫ్ కమిషన్ గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 5న ప్రభుత్వం ఏడుగురి పేర్లను రికమండ్ చేస్తూ గవర్నర్ కు లేఖ రాసింది. వారిలో కప్పర హరి ప్రసాద్, రాములు, వైష్ణవి పేర్లు లేవు. మొదట పంపిన జాబితాలో పీవీ శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్య రెడ్డి, పర్వీన్ మొహిసిన్ పేర్లు మాత్రమే ఉన్నాయి. దేశాల భూపాల్ పేరుకొత్తగా చేరింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై గవర్నర్ తో చర్చించినట్టు ప్రచారం జరిగిన గంటల వ్యవధిలో ఉత్తర్వులు వెలువడ్డాయి.
తాజా వార్తలు
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి







