CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- May 13, 2025
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈసారి 88.39 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు, ఇది గత సంవత్సరం కంటే 0.41 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ సంవత్సరం CBSE 12వ తరగతి పరీక్షల్లో 91 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది అబ్బాయిల కంటే 5.94 శాతం ఎక్కువ.
CBSE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు విజయవంతంగా నిర్వహించారు. అయితే 10వ తరగతి పరీక్షలు మార్చి 18న ముగిశాయి. CBSE 12వ తరగతి పరీక్షలకు 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 14 లక్షలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఈ ప్రాంతంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించింది. 99.60 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో ప్రయాగ్రాజ్ అట్టడుగున ఉంది. ఇండియాలోని 7,842 కేంద్రాలు, విదేశాలలో 26 ప్రదేశాలలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షలు జరిగాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







