CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- May 13, 2025
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈసారి 88.39 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు, ఇది గత సంవత్సరం కంటే 0.41 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ సంవత్సరం CBSE 12వ తరగతి పరీక్షల్లో 91 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది అబ్బాయిల కంటే 5.94 శాతం ఎక్కువ.
CBSE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు విజయవంతంగా నిర్వహించారు. అయితే 10వ తరగతి పరీక్షలు మార్చి 18న ముగిశాయి. CBSE 12వ తరగతి పరీక్షలకు 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 14 లక్షలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఈ ప్రాంతంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించింది. 99.60 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో ప్రయాగ్రాజ్ అట్టడుగున ఉంది. ఇండియాలోని 7,842 కేంద్రాలు, విదేశాలలో 26 ప్రదేశాలలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షలు జరిగాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!