CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- May 13, 2025
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈసారి 88.39 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు, ఇది గత సంవత్సరం కంటే 0.41 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ సంవత్సరం CBSE 12వ తరగతి పరీక్షల్లో 91 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది అబ్బాయిల కంటే 5.94 శాతం ఎక్కువ.
CBSE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు విజయవంతంగా నిర్వహించారు. అయితే 10వ తరగతి పరీక్షలు మార్చి 18న ముగిశాయి. CBSE 12వ తరగతి పరీక్షలకు 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 14 లక్షలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఈ ప్రాంతంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించింది. 99.60 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో ప్రయాగ్రాజ్ అట్టడుగున ఉంది. ఇండియాలోని 7,842 కేంద్రాలు, విదేశాలలో 26 ప్రదేశాలలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షలు జరిగాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







