CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- May 13, 2025
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈసారి 88.39 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు, ఇది గత సంవత్సరం కంటే 0.41 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ సంవత్సరం CBSE 12వ తరగతి పరీక్షల్లో 91 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది అబ్బాయిల కంటే 5.94 శాతం ఎక్కువ.
CBSE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు విజయవంతంగా నిర్వహించారు. అయితే 10వ తరగతి పరీక్షలు మార్చి 18న ముగిశాయి. CBSE 12వ తరగతి పరీక్షలకు 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 14 లక్షలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఈ ప్రాంతంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించింది. 99.60 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో ప్రయాగ్రాజ్ అట్టడుగున ఉంది. ఇండియాలోని 7,842 కేంద్రాలు, విదేశాలలో 26 ప్రదేశాలలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షలు జరిగాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









