IPL జట్లకు శుభవార్త!
- May 14, 2025
ఐపీఎల్ 2025 సీజన్లో ఆటగాళ్ల రీ ప్లేస్మెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుమతిచ్చింది. కానీ ఈ రీ ప్లేస్మెంట్స్కు షరతులు వర్తిస్తాయని తెలిపింది.
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ కొన్ని రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది విదేశీ ప్లేయర్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. ఉద్రిక్తతలు తగ్గడంతో మే 17 నుంచి ఐపీఎల్ పున:ప్రారంభం కాబోతుంది.
అయితే కొందరు విదేశీ ఆటగాళ్లు భారత్కు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తమ జాతియ జట్లకు ఆడాలి కొందరూ.. గాయాలని మరికొందరూ.. వ్యక్తిగత కారణాలతో మరికంత మంది ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండటంలేదు.
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా ఐపీఎల్ నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో కొత్త వారిని జట్టులోకి తీసుకునేందుకు అనుమతిచ్చారు. అయితే, ఈ రీప్లేస్మెంట్లు తాత్కాలికమేనని, వచ్చే సీజన్కు వారిని రిటైన్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
తాత్కలికంగా ఇప్పుడు చేరే జట్లలోని ఆటగాళ్లు ఐపీఎల్ 2026 మినీ వేలం సమయంలో మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
కాగా, ఈ రూల్ ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్.. జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ స్థానాన్ని బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్తో భర్తీ చేసింది. రూ.6 కోట్లకు అతన్ని తీసుకుంది.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







