IPL జట్లకు శుభవార్త!
- May 14, 2025
ఐపీఎల్ 2025 సీజన్లో ఆటగాళ్ల రీ ప్లేస్మెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుమతిచ్చింది. కానీ ఈ రీ ప్లేస్మెంట్స్కు షరతులు వర్తిస్తాయని తెలిపింది.
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ కొన్ని రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది విదేశీ ప్లేయర్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. ఉద్రిక్తతలు తగ్గడంతో మే 17 నుంచి ఐపీఎల్ పున:ప్రారంభం కాబోతుంది.
అయితే కొందరు విదేశీ ఆటగాళ్లు భారత్కు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తమ జాతియ జట్లకు ఆడాలి కొందరూ.. గాయాలని మరికొందరూ.. వ్యక్తిగత కారణాలతో మరికంత మంది ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండటంలేదు.
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా ఐపీఎల్ నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి స్థానంలో కొత్త వారిని జట్టులోకి తీసుకునేందుకు అనుమతిచ్చారు. అయితే, ఈ రీప్లేస్మెంట్లు తాత్కాలికమేనని, వచ్చే సీజన్కు వారిని రిటైన్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
తాత్కలికంగా ఇప్పుడు చేరే జట్లలోని ఆటగాళ్లు ఐపీఎల్ 2026 మినీ వేలం సమయంలో మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
కాగా, ఈ రూల్ ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్.. జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ స్థానాన్ని బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్తో భర్తీ చేసింది. రూ.6 కోట్లకు అతన్ని తీసుకుంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







