ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే.. 200,000 దిర్హామ్ల జరిమానా..!!
- May 16, 2025
యూఏఈ: యూఏఈలో ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రస్ అల్ ఖైమా పోలీసులు ఒక రిమైండర్ జారీ చేశారు. ఈ మేరకు ఆన్లైన్లో ఓ పోస్ట్ చేసారు. ఫేక్ న్యూస్, పుకార్లకు సంబంధించిన పోస్టులను షేర్ చేసినా, వైరల్ చేసినా భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
యూఏఈ చట్టం ప్రకారం, నిందితుడిగా నిరూపితమైతే Dh100,000 నుండి Dh200,000 వరకు జరిమానాతోపాటు ఒకటి నుండి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.
- తప్పుడు వార్తలు లేదా డేటాను ప్రకటించడం, వ్యాప్తి చేయడం. అధికారికంగా ప్రకటించిన దానికి విరుద్ధంగా తప్పుడు, పక్షపాత, తప్పుదారి పట్టించే లేదా తప్పుడు పుకార్లు. ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించే లేదా రెచ్చగొట్టే, ప్రజా శాంతికి భంగం కలిగించేలా ప్రసంగాలు, పోస్టులు. ప్రజలలో భయాన్ని వ్యాప్తి చేసే విధంగా ఉన్న వార్తలు. ప్రజా ప్రయోజనాలకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా క్రమం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏవైనా రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేయడం నేరంగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!







