ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే.. 200,000 దిర్హామ్ల జరిమానా..!!
- May 16, 2025
యూఏఈ: యూఏఈలో ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రస్ అల్ ఖైమా పోలీసులు ఒక రిమైండర్ జారీ చేశారు. ఈ మేరకు ఆన్లైన్లో ఓ పోస్ట్ చేసారు. ఫేక్ న్యూస్, పుకార్లకు సంబంధించిన పోస్టులను షేర్ చేసినా, వైరల్ చేసినా భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
యూఏఈ చట్టం ప్రకారం, నిందితుడిగా నిరూపితమైతే Dh100,000 నుండి Dh200,000 వరకు జరిమానాతోపాటు ఒకటి నుండి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.
- తప్పుడు వార్తలు లేదా డేటాను ప్రకటించడం, వ్యాప్తి చేయడం. అధికారికంగా ప్రకటించిన దానికి విరుద్ధంగా తప్పుడు, పక్షపాత, తప్పుదారి పట్టించే లేదా తప్పుడు పుకార్లు. ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించే లేదా రెచ్చగొట్టే, ప్రజా శాంతికి భంగం కలిగించేలా ప్రసంగాలు, పోస్టులు. ప్రజలలో భయాన్ని వ్యాప్తి చేసే విధంగా ఉన్న వార్తలు. ప్రజా ప్రయోజనాలకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా క్రమం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏవైనా రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేయడం నేరంగా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







