ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే.. 200,000 దిర్హామ్‌ల జరిమానా..!!

- May 16, 2025 , by Maagulf
ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే.. 200,000 దిర్హామ్‌ల జరిమానా..!!

యూఏఈ: యూఏఈలో ఫేక్ న్యూస్, పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రస్‌ అల్ ఖైమా పోలీసులు ఒక రిమైండర్ జారీ చేశారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఓ పోస్ట్ చేసారు. ఫేక్ న్యూస్, పుకార్లకు సంబంధించిన పోస్టులను షేర్ చేసినా, వైరల్ చేసినా భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరించారు.

యూఏఈ చట్టం ప్రకారం, నిందితుడిగా నిరూపితమైతే Dh100,000 నుండి Dh200,000 వరకు జరిమానాతోపాటు ఒకటి నుండి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. 

- తప్పుడు వార్తలు లేదా డేటాను ప్రకటించడం, వ్యాప్తి చేయడం. అధికారికంగా ప్రకటించిన దానికి విరుద్ధంగా తప్పుడు, పక్షపాత, తప్పుదారి పట్టించే లేదా తప్పుడు పుకార్లు.   ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించే లేదా రెచ్చగొట్టే, ప్రజా శాంతికి భంగం కలిగించేలా ప్రసంగాలు, పోస్టులు.  ప్రజలలో భయాన్ని వ్యాప్తి చేసే విధంగా ఉన్న వార్తలు.  ప్రజా ప్రయోజనాలకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా క్రమం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే ఏవైనా రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేయడం నేరంగా పరిగణిస్తారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com