మే 20 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరం..!!
- May 19, 2025
దోహా: ఖతార్ ఎకనామిక్ ఫోరం 5వ ఎడిషన్ సమావేశాలు మే 20 నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. దోహాలో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం ఫోరమ్ "ది రోడ్ టు 2030: ట్రాన్స్ఫార్మింగ్ ది గ్లోబల్ ఎకానమీ" థీమ్ జరుగనుంది. ఖతార్ ఎకనామిక్ ఫోరం 2022, 2024 మధ్య ఖతార్ జిడిపికి QR177.5 మిలియన్లకు పైగా ప్రయోజనం కలిగిందని, తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించబడ్డాయని పేర్కొన్నారు.
ఖతార్ నేషనల్ విజన్ 2030ని ముందుకు తీసుకెళ్లడంలో.. దోహాను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఫోరమ్ ప్రముఖ పాత్రను పోషించనుందని మీడియా సిటీ ఖతార్ సీఈఓ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జాసిమ్ మొహమ్మద్ అల్ ఖోరి తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







