మే 20 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరం..!!
- May 19, 2025
దోహా: ఖతార్ ఎకనామిక్ ఫోరం 5వ ఎడిషన్ సమావేశాలు మే 20 నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. దోహాలో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం ఫోరమ్ "ది రోడ్ టు 2030: ట్రాన్స్ఫార్మింగ్ ది గ్లోబల్ ఎకానమీ" థీమ్ జరుగనుంది. ఖతార్ ఎకనామిక్ ఫోరం 2022, 2024 మధ్య ఖతార్ జిడిపికి QR177.5 మిలియన్లకు పైగా ప్రయోజనం కలిగిందని, తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించబడ్డాయని పేర్కొన్నారు.
ఖతార్ నేషనల్ విజన్ 2030ని ముందుకు తీసుకెళ్లడంలో.. దోహాను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఫోరమ్ ప్రముఖ పాత్రను పోషించనుందని మీడియా సిటీ ఖతార్ సీఈఓ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జాసిమ్ మొహమ్మద్ అల్ ఖోరి తెలిపారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









