మే 20 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరం..!!

- May 19, 2025 , by Maagulf
మే 20 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరం..!!

దోహా: ఖతార్ ఎకనామిక్ ఫోరం 5వ ఎడిషన్ సమావేశాలు మే 20 నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. దోహాలో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం ఫోరమ్  "ది రోడ్ టు 2030: ట్రాన్స్ఫార్మింగ్ ది గ్లోబల్ ఎకానమీ" థీమ్ జరుగనుంది.   ఖతార్ ఎకనామిక్ ఫోరం 2022,  2024 మధ్య ఖతార్ జిడిపికి QR177.5 మిలియన్లకు పైగా ప్రయోజనం కలిగిందని, తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించబడ్డాయని పేర్కొన్నారు.

ఖతార్ నేషనల్ విజన్ 2030ని ముందుకు తీసుకెళ్లడంలో.. దోహాను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఫోరమ్ ప్రముఖ పాత్రను పోషించనుందని మీడియా సిటీ ఖతార్ సీఈఓ, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జాసిమ్ మొహమ్మద్ అల్ ఖోరి తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com