$5 మిలియన్ల ఒప్పందంపై కెఎస్ రిలీఫ్, UNDP సంతకాలు..!!
- May 21, 2025
బ్రస్సెల్స్: సిరియాలోని 14 గవర్నరేట్లలో ఎనిమిదింటిలో 33 బ్రెడ్ ఉత్పత్తి యూనిట్లను పునర్ ప్రారంభించడం ద్వారా ఆహార భద్రతను పెంపొందించడానికి కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (కెఎస్ రిలీఫ్) సోమవారం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్డిపి)తో 5 మిలియన్ల డాలర్ల ఉమ్మడి ప్రాజెక్టు ఒప్పందంపై సంతకం చేసింది.
బ్రస్సెల్స్లో జరిగిన యూరోపియన్ హ్యుమానిటేరియన్ ఫోరం 2025 సందర్భంగా యుఎన్డిపి నిర్వాహకుడు అచిమ్ స్టైనర్, కెఎస్ రిలీఫ్ జనరల్ సూపర్వైజర్ డాక్టర్ అబ్దుల్లా అల్-రబీహ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పునరావాస ప్రాజెక్టులో ప్రాథమిక పునరుద్ధరణ పనులు, కొత్త ఉత్పత్తి లైన్ల స్థాపన, మొబైల్ బ్రెడ్ ఉత్పత్తి యూనిట్ల పునరావాసం ఉన్నాయి.
ప్రస్తుతం 12.4 మిలియన్లకు పైగా ప్రజలు, లేదా జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మంది పద్నాలుగు సంవత్సరాల సంఘర్షణ తర్వాత సిరియాలో ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు బేకరీ రంగంలో 500 ఉద్యోగాలను సృష్టించడం, స్థానిక ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







