భారీ వర్షాలు.. యథాతథంగా యూఏఈ-భారత్ విమాన సర్వీసులు..!!
- May 22, 2025
యూఏఈ: గత కొన్ని రోజులుగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరే కొన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాలపై ప్రభావం పడింది. అయితే, యూఏఈ, భారతదేశం మధ్య విమానాలు మాత్రం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి.
యూఏఈకి చెందిన విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లైదుబాయ్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ ప్రతికూలత తమ విమాన సర్వీసులపై ప్రత్యక్ష ప్రభావం చూపదని అన్నారు.
మరోవైపు, ఇండియా వ్యాప్తంగా రుతుపవనాలకు ముందు వర్షాలు కురుస్తున్నాయి. న్యూఢిల్లీ, పూణే, గోవా, బెంగళూరు వంటి ప్రధాన నగరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.
ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ బెంగళూరులోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









