భారీ వర్షాలు.. యథాతథంగా యూఏఈ-భారత్ విమాన సర్వీసులు..!!
- May 22, 2025
యూఏఈ: గత కొన్ని రోజులుగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరే కొన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాలపై ప్రభావం పడింది. అయితే, యూఏఈ, భారతదేశం మధ్య విమానాలు మాత్రం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి.
యూఏఈకి చెందిన విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లైదుబాయ్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ ప్రతికూలత తమ విమాన సర్వీసులపై ప్రత్యక్ష ప్రభావం చూపదని అన్నారు.
మరోవైపు, ఇండియా వ్యాప్తంగా రుతుపవనాలకు ముందు వర్షాలు కురుస్తున్నాయి. న్యూఢిల్లీ, పూణే, గోవా, బెంగళూరు వంటి ప్రధాన నగరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.
ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ బెంగళూరులోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









