పుష్కరాల్లో తొక్కిసలాట, 11మంది మృతి
- July 13, 2015
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలు తీవ్ర విషాదాన్ని రగిలించాయి. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 11మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్రగాయాల పాలైనట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. మృతులు విశాఖ, శ్రీకాకుళం, పశ్చిమగోదావరికి చెందినవారి తెలుస్తోంది. గాయపడిన వారిని రాజమండ్రికి ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కాగా భక్తులను అదుపు చేయటంలో పోలీసులు విఫలమయ్యారు. కాగా, పుష్కర ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని భక్తులు చెబుతున్నారు. మరోవైపు పుష్కర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. భక్తులను తరలించేందుకు ఏర్పాటు చేసామన్న ఫ్రీ బస్సుల జాడ లేదని విమర్శించారు. క్యూ లైన్ల వ్యవస్థ సరిగా లేదని తెలిపారు. కనీసం తాగడానికి మంచినీటి సదుపాయం కల్పించలేదని మండిపడ్డారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







