ఐఫోన్లు అమెరికాలోనే తయారుకావాలి, లేదంటే 25% సుంకం
- May 23, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయన లక్ష్యంగా పెట్టుకున్నది ఆపిల్ కంపెనీ. ట్రంప్ స్పష్టం చేశారు—అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్లు అక్కడే తయారవ్వాలి. లేకపోతే కనీసం 25 శాతం టారిఫ్ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ వ్యాఖ్యలు ఆపిల్ ఇండియా ఉత్పత్తి ప్రణాళికలపై ప్రభావం చూపేలా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం ఐఫోన్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారుతోంది. అయితే ట్రంప్ ఇలా స్పష్టం చేయడం ఆపిల్కు ఎదురుదెబ్బే.ట్రంప్ తేల్చి చెప్పారు: “ఇది కొత్త విషయం కాదు. చాలా కాలంగా టిమ్ కుక్కి చెబుతున్నాను. అమెరికాలో అమ్మే ఫోన్లు ఇండియాలో తయారవకూడదు. వాటిని అమెరికాలోనే తయారు చేయాలి.” ఈ వ్యాఖ్యలు ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్లో వెల్లడించారు.ఐతే ఈ మాటల ప్రభావం వెంటనే కనిపించింది. ఆపిల్ షేర్స్ 3%కి పైగా పడిపోయాయి. ఇది ప్రీమార్కెట్ ట్రేడింగ్కి పెద్ద షాక్.
చైనా మీద ఆధారాన్ని తగ్గించాలని ఆపిల్ ఎప్పటినుంచో చూస్తోంది. కోవిడ్ టైంలో చైనాలో ఫ్యాక్టరీల పని దెబ్బతినడంతో, ఆపిల్ దృష్టి భారత్ మీద పడింది. దక్షిణ భారతదేశంలోని ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు ఇప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.ఇటీవల విస్ట్రాన్ వ్యాపారం టాటా గ్రూప్ తీసుకుంది. ఈ పరిణామాలతో భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరుగుతోంది. గత ఏడాది మాత్రమే భారత్లో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు తయారయ్యాయి. ఇది 60 శాతం పెరుగుదల.
“నిన్న టిమ్ కుక్తో ఒక చిన్న డిబేట్ జరిగింది. ఆయన ఇండియాలో బాగా ఉత్పత్తి చేస్తున్నారు. కానీ నాకు అది నచ్చడం లేదు,” అన్నారు ట్రంప్. ఆయన అభిప్రాయం ప్రకారం, అమెరికా ఉద్యోగాలు అమెరికాలో ఉండాలి. ఇదే ప్రధాన కారణం ఆయన హెచ్చరికలకి.
ఆపిల్ అమెరికాలో ఉత్పత్తిని పెంచుతుందన్న వాగ్దానం ఇచ్చినా, అది తక్షణం సాధ్యపడదు. ఇప్పుడు సంస్థ ముందున్నది కష్టమైన నిర్ణయం. భారత్లో వృద్ధిని కొనసాగించాలా? లేక అమెరికాలో ఉత్పత్తిని పెంచాలా? ఈ పరిస్థితులు చూస్తే, ఆపిల్ వ్యూహం మరోసారి పునర్విమర్శ చేయాల్సి రావచ్చు. ట్రంప్ పునఃప్రవేశంతో గ్లోబల్ టెక్ కంపెనీలు ముందుకు ఎలాంటి వ్యూహాలతో వస్తాయో చూడాలి.
తాజా వార్తలు
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..







