బహ్రెయిన్ ను సందర్శించనున్న ఉన్నత స్థాయి భారత బృందం..!!
- May 24, 2025
మనామా: భారత పార్లమెంటు సభ్యుడు బైజయంత్ పాండా నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు, సీనియర్ రాజకీయ ప్రముఖులు, మాజీ దౌత్యవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం 2025 మే 24-25 తేదీలలో బహ్రెయిన్లో రెండు రోజులపాటు పర్యటించనుంది. వారు బహ్రెయిన్ ప్రభుత్వం, పార్లమెంటు ఉన్నతాధికారులు, ఇతర వాటాదారులతో సమావేశమవుతారని ప్రకటించారు. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తదనంతర సంబంధిత పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది.
భారతదేశం, బహ్రెయిన్ దేశాలు చాలా బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 2023- 24లో ద్వైపాక్షిక వాణిజ్యం 1.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బహ్రెయిన్ మొదటి ఐదు వాణిజ్య భాగస్వాములలో భారతదేశం ఒకటి. 2019 నుండి ద్వైపాక్షిక పెట్టుబడులు 40% పెరిగాయి. 2023 మొదటి త్రైమాసికం నుండి 2024 మొదటి త్రైమాసికం వరకు, భారతదేశం నుండి బహ్రెయిను 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులలో 15% పెరుగుదల ఉంది. దీని వలన మొత్తం ద్వైపాక్షిక పెట్టుబడులు 1.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2022, 2023 మధ్య పర్యాటకుల సంఖ్య 44% పెరిగి 1 మిలియన్ పర్యాటకుల సంఖ్యను దాటింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!