మలేషియా మాస్టర్స్: రన్నరప్గా శ్రీకాంత్ కిదాంబి..
- May 25, 2025
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు.టోర్నమెంట్ ఆరంభం నుంచి పురుషుల సింగిల్స్లో వరుస విజయాలతో అద్భుత ప్రదర్శనలు చేసిన తెలుగు తేజం శ్రీకాంత్ తుది మెట్టు పై మాత్రం బోల్తపడ్డాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 11-21, 9-21 తేడాతో చైనీస్ టాప్ షట్లర్, ప్రపంచ 4వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన చైనా స్టార్ 39 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
కాగా, దాదాపు ఆరేళ్ల తర్వాత ఓ సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ప్రవేశించిన భారత స్టార్ కిదాంబికి ఆఖరి మెట్టుపై భారీ నిరాశా ఎదురైంది.ఇక ఈ టైటిల్ పోరులో ఓడినప్పటికీ ఓవరాల్గా మాత్రం శ్రీకాంత్ ప్రదర్శన ఈ టోర్నీలో అద్భుతంగా సాగింది.ముందు రెండు క్వాలఫయర్స్ మ్యాచ్లను నెగ్గి కిదాంబి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
అక్కడ కూడా తన వరుస విజయాల పరంపర కొనసాగిస్తూ తుది పోరుకు దూసుకెళ్లాడు.ఈ టోర్నీకి ముందు శ్రీకాంత్ 2019లో చివరిసారి ఇండియా ఓపెన్లో ఫైనల్లో ప్రవేశించాడు.ఇక గత కొన్నేళ్లుగా గాయాలు, ఫామ్లేమి సమస్యలతో మేజర్ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శనలు చేయలేక పోయాడు. కానీ, ఎట్టకేలకు ఇప్పుడు మాజీ వరల్డ్ నం.1 మళ్లి ఫామ్ను అందుకోవడం భారత ఫ్యాన్స్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







