మలేషియా మాస్టర్స్: రన్నరప్గా శ్రీకాంత్ కిదాంబి..
- May 25, 2025
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు.టోర్నమెంట్ ఆరంభం నుంచి పురుషుల సింగిల్స్లో వరుస విజయాలతో అద్భుత ప్రదర్శనలు చేసిన తెలుగు తేజం శ్రీకాంత్ తుది మెట్టు పై మాత్రం బోల్తపడ్డాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 11-21, 9-21 తేడాతో చైనీస్ టాప్ షట్లర్, ప్రపంచ 4వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన చైనా స్టార్ 39 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
కాగా, దాదాపు ఆరేళ్ల తర్వాత ఓ సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ప్రవేశించిన భారత స్టార్ కిదాంబికి ఆఖరి మెట్టుపై భారీ నిరాశా ఎదురైంది.ఇక ఈ టైటిల్ పోరులో ఓడినప్పటికీ ఓవరాల్గా మాత్రం శ్రీకాంత్ ప్రదర్శన ఈ టోర్నీలో అద్భుతంగా సాగింది.ముందు రెండు క్వాలఫయర్స్ మ్యాచ్లను నెగ్గి కిదాంబి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
అక్కడ కూడా తన వరుస విజయాల పరంపర కొనసాగిస్తూ తుది పోరుకు దూసుకెళ్లాడు.ఈ టోర్నీకి ముందు శ్రీకాంత్ 2019లో చివరిసారి ఇండియా ఓపెన్లో ఫైనల్లో ప్రవేశించాడు.ఇక గత కొన్నేళ్లుగా గాయాలు, ఫామ్లేమి సమస్యలతో మేజర్ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శనలు చేయలేక పోయాడు. కానీ, ఎట్టకేలకు ఇప్పుడు మాజీ వరల్డ్ నం.1 మళ్లి ఫామ్ను అందుకోవడం భారత ఫ్యాన్స్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!