పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- February 11, 2026
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలోని పలువురు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని, సత్యకుమార్కు బెదిరింపు లేఖలు వచ్చాయి. కందుల దుర్గేశ్కు బెదిరింపు రావడంతో..మంత్రి కార్యాలయ అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తుళ్లూరు పోలీసులు ఈ బెదిరింపులు లేఖ వ్యవహారం పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి, ఎవరు పంపారు.. నేరుగా సచివాలయంలోని మంత్రి పేషీకి ఎలా చేరిందో ఆరా తీస్తున్నారు. అంతేకాదు సచివాలయంలోని సీసీ ఫుటేజ్, పోస్టల్ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.మంత్రిని బెదిరిస్తూ లేఖ పంపారా?..ఎవరైనా ఆకతాయిలు మంత్రిని బెదిరించడానికి ఇలా చేశారా అనే కాణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మంత్రి పేషీకి బెదిరింపులు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేవాలు కూడా ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తానికి మంత్రికి బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







