పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- February 11, 2026
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలోని పలువురు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని, సత్యకుమార్కు బెదిరింపు లేఖలు వచ్చాయి. కందుల దుర్గేశ్కు బెదిరింపు రావడంతో..మంత్రి కార్యాలయ అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తుళ్లూరు పోలీసులు ఈ బెదిరింపులు లేఖ వ్యవహారం పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి, ఎవరు పంపారు.. నేరుగా సచివాలయంలోని మంత్రి పేషీకి ఎలా చేరిందో ఆరా తీస్తున్నారు. అంతేకాదు సచివాలయంలోని సీసీ ఫుటేజ్, పోస్టల్ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.మంత్రిని బెదిరిస్తూ లేఖ పంపారా?..ఎవరైనా ఆకతాయిలు మంత్రిని బెదిరించడానికి ఇలా చేశారా అనే కాణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మంత్రి పేషీకి బెదిరింపులు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేవాలు కూడా ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తానికి మంత్రికి బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు









