కువైట్ లో అడుగుపెట్టిన భారతదేశ అఖిలపక్ష ప్రతినిధి బృందం..!!
- May 26, 2025
కువైట్: భారత పార్లమెంటు సభ్యుడు బైజయంత్ జే పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం సోమవారం ఉదయం కువైట్ చేరుకున్నది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద దురాగతాలు, ఆపరేషన్ అనంతరం పరిణామాల గురించి కువైట్ ప్రభుత్వానికి వివరించనుంది. భారత ప్రతినిధి బృందాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా స్వాగతం పలికారు. అంతకుముందు భారత ప్రతినిధుల బృందం బహ్రెయిన్ లో తన పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకుంది.
భారత ప్రతినిధి బృందంలో కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే ఎంపీ (లోక్సభ), నాగాలాండ్ నుండి రాజ్యసభకు ఎన్నికైన మొదటి మహిళ ఎస్ ఫాంగ్నాన్ కోన్యాక్ ఎంపీ (రాజ్యసభ); జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ రేఖ శర్మ ఎంపీ (రాజ్యసభ); ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీ(లోక్సభ); చండీగఢ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఛాన్సలర్ సత్నాం సింగ్ సంధు ఎంపీ (రాజ్యసభ) ఉన్నారు. కువైట్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రతినిధి బృందం కువైట్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో పాటు సివిల్ సొసైటీలోని ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









