కువైట్ లో అడుగుపెట్టిన భారతదేశ అఖిలపక్ష ప్రతినిధి బృందం..!!
- May 26, 2025
కువైట్: భారత పార్లమెంటు సభ్యుడు బైజయంత్ జే పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం సోమవారం ఉదయం కువైట్ చేరుకున్నది. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద దురాగతాలు, ఆపరేషన్ అనంతరం పరిణామాల గురించి కువైట్ ప్రభుత్వానికి వివరించనుంది. భారత ప్రతినిధి బృందాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా స్వాగతం పలికారు. అంతకుముందు భారత ప్రతినిధుల బృందం బహ్రెయిన్ లో తన పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకుంది.
భారత ప్రతినిధి బృందంలో కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే ఎంపీ (లోక్సభ), నాగాలాండ్ నుండి రాజ్యసభకు ఎన్నికైన మొదటి మహిళ ఎస్ ఫాంగ్నాన్ కోన్యాక్ ఎంపీ (రాజ్యసభ); జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ రేఖ శర్మ ఎంపీ (రాజ్యసభ); ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీ(లోక్సభ); చండీగఢ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఛాన్సలర్ సత్నాం సింగ్ సంధు ఎంపీ (రాజ్యసభ) ఉన్నారు. కువైట్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రతినిధి బృందం కువైట్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో పాటు సివిల్ సొసైటీలోని ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







