ఆరుబయట చెత్తను పెడితే.. BD300 జరిమానా..!!
- May 26, 2025
మనామా: ఇళ్ల బయట బిన్ బ్యాగులను వదిలేస్తే.. ఉత్తర మునిసిపాలిటీ కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు పాటించకుండా చెత్తను ఇంటి బయట వదిలేస్తే BD300 వరకు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఇళ్ల ముందు నేరుగా ఉంచే వ్యర్థాలను సేకరించడం మునిసిపాలిటీ ఆపివేసింది. అదే సమయంలో నిర్దేశిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు, బారెల్స్ను ఉపయోగించమని నివాసితులకు సూచించింది.
ప్రజా పరిశుభ్రత చట్టం ప్రకారం, వ్యర్థాలను సరైన మూతలు ఉన్న కంటైనర్లలో నిల్వ చేయాలి . దానిని వేరే చోట వదిలివేయడం నేరం. జరిమానాలు BD50 నుండి ప్రారంభమవుతాయి. ఉల్లంఘన స్వభావాన్ని బట్టి BD300 వరకు పెరగవచ్చు. రాంలి హౌసింగ్ ప్రాంతంలో గృహ వ్యర్థాలను రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే బయటకు తీయాలని పేర్కొంటూ ఆయా అపార్టుమెంట్ల వద్ద నోటీసులు అతికించారు. ఇళ్ళు, కార్యాలయాలు, దుకాణాలు, కర్మాగారాలు, ఇతర సంస్థలతో సహా అన్ని రకాల ప్రాంగణాలకు ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యర్థాలను కవర్ చేసిన కంటైనర్లలోనే నిల్వ చేయాలి.వాటిని పబ్లిక్ ప్లేసులకు దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







