ఆరుబయట చెత్తను పెడితే.. BD300 జరిమానా..!!
- May 26, 2025
మనామా: ఇళ్ల బయట బిన్ బ్యాగులను వదిలేస్తే.. ఉత్తర మునిసిపాలిటీ కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు పాటించకుండా చెత్తను ఇంటి బయట వదిలేస్తే BD300 వరకు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఇళ్ల ముందు నేరుగా ఉంచే వ్యర్థాలను సేకరించడం మునిసిపాలిటీ ఆపివేసింది. అదే సమయంలో నిర్దేశిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు, బారెల్స్ను ఉపయోగించమని నివాసితులకు సూచించింది.
ప్రజా పరిశుభ్రత చట్టం ప్రకారం, వ్యర్థాలను సరైన మూతలు ఉన్న కంటైనర్లలో నిల్వ చేయాలి . దానిని వేరే చోట వదిలివేయడం నేరం. జరిమానాలు BD50 నుండి ప్రారంభమవుతాయి. ఉల్లంఘన స్వభావాన్ని బట్టి BD300 వరకు పెరగవచ్చు. రాంలి హౌసింగ్ ప్రాంతంలో గృహ వ్యర్థాలను రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే బయటకు తీయాలని పేర్కొంటూ ఆయా అపార్టుమెంట్ల వద్ద నోటీసులు అతికించారు. ఇళ్ళు, కార్యాలయాలు, దుకాణాలు, కర్మాగారాలు, ఇతర సంస్థలతో సహా అన్ని రకాల ప్రాంగణాలకు ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యర్థాలను కవర్ చేసిన కంటైనర్లలోనే నిల్వ చేయాలి.వాటిని పబ్లిక్ ప్లేసులకు దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







