ఆరుబయట చెత్తను పెడితే.. BD300 జరిమానా..!!
- May 26, 2025
మనామా: ఇళ్ల బయట బిన్ బ్యాగులను వదిలేస్తే.. ఉత్తర మునిసిపాలిటీ కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు పాటించకుండా చెత్తను ఇంటి బయట వదిలేస్తే BD300 వరకు జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఇళ్ల ముందు నేరుగా ఉంచే వ్యర్థాలను సేకరించడం మునిసిపాలిటీ ఆపివేసింది. అదే సమయంలో నిర్దేశిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు, బారెల్స్ను ఉపయోగించమని నివాసితులకు సూచించింది.
ప్రజా పరిశుభ్రత చట్టం ప్రకారం, వ్యర్థాలను సరైన మూతలు ఉన్న కంటైనర్లలో నిల్వ చేయాలి . దానిని వేరే చోట వదిలివేయడం నేరం. జరిమానాలు BD50 నుండి ప్రారంభమవుతాయి. ఉల్లంఘన స్వభావాన్ని బట్టి BD300 వరకు పెరగవచ్చు. రాంలి హౌసింగ్ ప్రాంతంలో గృహ వ్యర్థాలను రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే బయటకు తీయాలని పేర్కొంటూ ఆయా అపార్టుమెంట్ల వద్ద నోటీసులు అతికించారు. ఇళ్ళు, కార్యాలయాలు, దుకాణాలు, కర్మాగారాలు, ఇతర సంస్థలతో సహా అన్ని రకాల ప్రాంగణాలకు ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యర్థాలను కవర్ చేసిన కంటైనర్లలోనే నిల్వ చేయాలి.వాటిని పబ్లిక్ ప్లేసులకు దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







