ఫ్యామిలీ వీసా కోసం పే-స్లిప్ లో మానిపులేషన్..పలువురు ప్రవాసులకు నోటీసులు..!!
- May 29, 2025
కువైట్: కువైట్లో కుటుంబ వీసాలను నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం అనేక మంది ప్రవాసులకు నోటీసులు జారీ చేసింది. అధికారుల కథనం ప్రకారం.. చాలా మంది వ్యక్తులు KD 800 జీతం ఉందని, కుటుంబ వీసాలకు దరఖాస్తు చేసుకోగా.. వారికి అనమతి ఇచ్చారు. అయితే, వీసాలు పొందిన తర్వాత, వారు అధికారికంగా తక్కువ జీతాలను పొందారు. తద్వారా మంత్రివర్గ నిర్ణయం నిబంధనలను ఉల్లంఘించారని గుర్తించారు.
కుటుంబ వీసాలను పొందడానికి ఈ ప్రవాసులు KD 800 నెలవారీ ఆదాయాన్ని తెలిపే తప్పుడు సాలరీ సర్టిఫికేషన్ లను సమర్పించారని విచారణలో గుర్తించారు. కాగా, అధికారులు ఉల్లంఘించిన వారికి వారి నివాస స్థితిని సరిదిద్దుకోవడానికి లేదా వారి కుటుంబాలను స్వదేశానికి తిరిగి పంపించడానికి ఒక నెల గడువు ఇచ్చారు. సమన్లు పొందిన ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అధికారికంగా డిక్లరేషన్ పై సంతకం చేయాలని నిర్దేశించారు.
కుటుంబ పెద్ద తమ కుటుంబానికి మంచి జీవన ప్రమాణాలను అందించడానికి ఈ స్థాయి ఆదాయం అవసరమని సూచించే అధ్యయనాల ఆధారంగా KD 800 జీతం పరిమితిని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వివరించాయి. జాతీయత లేదా విద్యార్హతలతో సంబంధం లేకుండా, అందరూ ప్రవాసులు జీతం అవసరాలను తీర్చినట్లయితే, వారి కుటుంబాలను కువైట్కు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ అనుమతిస్తుందని స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









