నార్వే చెస్ టోర్నీలో చరిత్ర: గుకేశ్ చేతిలో కార్ల్సన్ ఓటమి
- June 02, 2025
నార్వే: నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ అసాధారణ విజయాన్ని అందుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. క్లాసికల్ చెస్లో కార్ల్సన్ను ఓడించడం గుకేశ్కు ఇదే మొదటిసారి కావడం గమనార్హం.ఈ విజయం తర్వాత గుకేశ్ కాసేపు ఆవేశంతో నిలిచిపోయాడు. అంత గొప్ప ఆటగాడిని ఓడించామంటే అది చిన్న విషయం కాదు. ఈ ఓటమితో అసహనానికి లోనైన కార్ల్సన్ తట్టుకోలేకపోయాడు. పిడికిలితో చెస్ బోర్డు టేబుల్ను గట్టిగా కొట్టాడు. గుకేశ్ను చూసి రెండుసార్లు “సారీ” చెప్పిన కార్ల్సన్ వెంటనే హాలునుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆరవ రౌండ్ ప్రారంభం నుంచే గుకేశ్ శాంతంగా, స్ట్రాటజిక్గా ఆడాడు. కార్ల్సన్ చేసిన ఒక చిన్న తప్పును చక్కగా వినియోగించుకొని, ఆపై పూర్తిగా గేమ్పై పట్టేసుకున్నాడు. ఒక్కసారిగా ఆధిపత్యం చూపించి ప్రత్యర్థిని చెక్మేట్కు దరికి తీసుకెళ్లాడు.గేమ్ ముగిసే సరికి ప్రపంచ నంబర్ 3 గుకేశ్, నంబర్ 1 కార్ల్సన్ను ఓడించాడు.
ఈ ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కార్ల్సన్ స్పందన, గుకేశ్ ఎమోషన్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదే భారత యువత శక్తి,చెస్ లో ఇండియా రెడీ, అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇతర ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయంటే…
ప్రస్తుతం కార్ల్సన్ 6 రౌండ్లలో రెండు విజయాలు, మూడు డ్రాలు, ఒక ఓటమితో 9.1 పాయింట్లతో టాప్లో ఉన్నాడు. ఫాబియానో కరువానా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గుకేశ్ మాత్రం మూడో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ టోర్నీలో మిగిలిన రౌండ్లు మరింత ఉత్కంఠ రేపనున్నాయి.
కార్ల్సన్కు భారతులెప్పుడూ కష్టమేనా?
గతేడాది ఇదే టోర్నీలో మరో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద కూడా కార్ల్సన్ను ఓడించాడు. అంటే సొంత గడ్డపై భారత యువత నుండి రెండు ఎదురుదెబ్బలు తిన్నాడు కార్ల్సన్. ఇది చెస్ ప్రపంచంలో భారత్ పెరుగుతున్న ప్రాభవానికి నిదర్శనం.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి







