విజయోత్సవం హింసాత్మకంగా మారడంతో ఇద్దరు మృతి
- June 02, 2025
పారిస్: ఫ్రాన్స్ లో ఫుట్బాల్ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది.ఈ ఘర్షణల్ల ఇద్దరు మృతి చెందగా, 192మంది గాయపడ్డారు.ఛాంపియన్స్ లీగ్లో పారిస్ సెయింట్-జర్మైన్-పీఎస్జీ ఫుట్బాల్ క్లబ్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.దీనితో వారి అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.
పలు వాహనాలతోపాటు బస్ షెల్టర్లను ధ్వంసం
ఈ సందర్భంగా ప్రత్యర్థి జట్టు అభిమానులతో మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రెచ్చిపోయిన అల్లరిమూకలు పలు వాహనాలతోపాటు బస్ షెల్టర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు వారు దుకాణాల దోపిడీలకూ పాల్పడినట్లు చెప్పారు. అసాంఘిక శక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి. అల్లర్లకు బాధ్యులైన 559 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!









