విజయోత్సవం హింసాత్మకంగా మారడంతో ఇద్దరు మృతి
- June 02, 2025
పారిస్: ఫ్రాన్స్ లో ఫుట్బాల్ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది.ఈ ఘర్షణల్ల ఇద్దరు మృతి చెందగా, 192మంది గాయపడ్డారు.ఛాంపియన్స్ లీగ్లో పారిస్ సెయింట్-జర్మైన్-పీఎస్జీ ఫుట్బాల్ క్లబ్ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.దీనితో వారి అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.
పలు వాహనాలతోపాటు బస్ షెల్టర్లను ధ్వంసం
ఈ సందర్భంగా ప్రత్యర్థి జట్టు అభిమానులతో మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రెచ్చిపోయిన అల్లరిమూకలు పలు వాహనాలతోపాటు బస్ షెల్టర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు వారు దుకాణాల దోపిడీలకూ పాల్పడినట్లు చెప్పారు. అసాంఘిక శక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి. అల్లర్లకు బాధ్యులైన 559 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







