విజయోత్సవం హింసాత్మకంగా మారడంతో ఇద్దరు మృతి

- June 02, 2025 , by Maagulf
విజయోత్సవం హింసాత్మకంగా మారడంతో ఇద్దరు మృతి

పారిస్: ఫ్రాన్స్‌ లో ఫుట్‌బాల్‌ టోర్నీ విజయోత్సవం హింసాత్మకంగా మారింది.ఈ ఘర్షణల్ల ఇద్దరు మృతి చెందగా, 192మంది గాయపడ్డారు.ఛాంపియన్స్ లీగ్‌లో పారిస్ సెయింట్-జర్మైన్-పీఎస్​జీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది.దీనితో వారి అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు.

పలు వాహనాలతోపాటు బస్‌ షెల్టర్లను ధ్వంసం
ఈ సందర్భంగా ప్రత్యర్థి జట్టు అభిమానులతో మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రెచ్చిపోయిన అల్లరిమూకలు పలు వాహనాలతోపాటు బస్‌ షెల్టర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు వారు దుకాణాల దోపిడీలకూ పాల్పడినట్లు చెప్పారు. అసాంఘిక శక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో రంగంలోకి దిగిన భద్రతాదళాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి. అల్లర్లకు బాధ్యులైన 559 మందిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com