తెలంగాణ ప్రభుత్వ యోచన..
- July 12, 2016
21 ఏళ్లలోపు వారికి మద్యం సరఫరా చేసే బార్లు, వైన్షాపులపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఎక్సైజ్ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. పంజాగుట్టలో జరిగిన రోడ్డుప్రమాదంలో చిన్నారి రమ్య మృతి చెందిన ఘటనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇంజినీరింగ్ విద్యార్థి మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. మద్యం సరఫరాపై సమీక్షించారు. బార్లపై నిఘా కఠినతరం చేయాలని, ప్రతి బార్లోనూ సీసీ కెమెరా తప్పనిసరి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం
టీజీఐ బార్పై కేసు నమోదు
బంజారాహిల్స్లోని టీజీఐ బార్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ఇంజినీరింగ్ విద్యార్థులు టీజీఐ బార్లోనే మద్యం సేవించినట్లు తేలడంతో.. మైనర్లకు మద్యం సరఫరా చేసిన నేరంపై కేసు నమోదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







