ఎయిరిండియా మరో ఏడు రూట్లకు ఆఫర్..
- July 12, 2016
ఆఖరినిమిషంలో ప్రయాణాలు కుదుర్చుకున్నవారికి ఎయిర్ఇండియా ప్రకటించిన ఆఫర్ను మరో ఏడు రూట్లకు పెంచింది. ప్రస్తుతం దేశ రాజధాని నుంచి నాలుగు నగరాలకు వెళ్లే విమాన సర్వీసులకు ఈ ఆఫర్ కల్పించగా.. తాజాగా హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా సహా ఏడు రూట్లలో ఆఖరినిమిషం టికెట్ ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది.
ముఖ్యమైన మార్గాల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎయిర్ఇండియా ఇటీవల ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విమానం బయలుదేరే నాలుగు గంటలకు ముందు టికెట్ కొనుగోలు చేసుకునే వారికి రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ2 టైర్ ఛార్జీల కంటే తక్కువకే టిక్కెట్లు విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దిల్లీ నుంచి ముంబయి, చెన్నై, కోల్కతా, బెంగళూరుకు వెళ్లే సర్వీసులకు ఈ ఆఫర్ను కల్పించింది. తాజాగా.. దిల్లీ నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా, రాంచీ, భువనేశ్వర్, పట్నా, రాయ్పూర్ వెళ్లే విమానాల్లోనూ ఆఖరినిమిషం టికెట్ల సదుపాయం కల్పిస్తోంది.
ఈ ఆఫర్ కింద టికెట్ ధరలు దిల్లీ-హైదరాబాద్ రూ. 3,275, దిల్లీ-అహ్మదాబాద్ రూ. 2,270, దిల్లీ-రాంచీ రూ. 2,770, దిల్లీ-భువనేశ్వర్ రూ. 3,475, దిల్లీ-గోవా రూ. 3,665, దిల్లీ-పట్నా రూ. 2,315, దిల్లీ-రాయ్పూర్ రూ. 2,240గా ఉన్నట్లు ఎయిర్ఇండియా తెలిపింది
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







