Dh40 బిలియన్ విలువైన ఫాహిద్ ద్వీపం ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- June 02, 2025
యూఏఈ: అబుదాబి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ ఫాహిద్ ద్వీపం ప్రారంభమైంది. ఇది అల్దార్ ద్వారా కొత్త Dh40 బిలియన్ల మాస్టర్ప్లాన్డ్ తీరప్రాంత కమ్యూనిటీగా ప్రకటించారు. 2.7 మిలియన్ చదరపు మీటర్ల ద్వీపంలో 6,000 కంటే ఎక్కువ హై-ఎండ్ గృహాలు, 10 కి.మీ ఫిట్నెస్ కారిడార్, 4.6 కి.మీ బీచ్లు, ప్రత్యేక వాటర్ఫ్రంట్ ప్రొమెనేడ్ ఉంటాయి.
ఇది అబుదాబిలో మొట్టమొదటి తీరప్రాంత వెల్నెస్ ద్వీపంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఫిట్వెల్ సర్టిఫికేషన్ పొందింది. ఇది ప్రపంచ ఆరోగ్యకరమైన భవన ప్రమాణాలను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి ద్వీపంగా నిలిచింది.
యాస్, సాదియత్ దీవుల మధ్య ఉన్న ఫాహిద్ ద్వీపం.. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అబుదాబిలోని విశ్రాంతి, సాంస్కృతిక , విమానయాన కేంద్రాలకు కనెక్టివ్ గా ఉంటుంది. వీటి మధ్య ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలు అని అల్దార్ తెలిపింది. విదేశీ పెట్టుబడిదారుల నుండి అద్భుతమైన డిమాండ్ ఉందని అల్దార్ గ్రూప్ సీఈఓ తలాల్ అల్ ధియేబి తెలిపారు. అబుదాబిలో ప్రారంభించిన అతిపెద్ద మల్టీ యూజ్ వినియోగ నివాస మాస్టర్ప్లాన్లలో ఫాహిద్ ద్వీపం ఒకటి అని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







