Dh40 బిలియన్ విలువైన ఫాహిద్ ద్వీపం ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- June 02, 2025
యూఏఈ: అబుదాబి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ ఫాహిద్ ద్వీపం ప్రారంభమైంది. ఇది అల్దార్ ద్వారా కొత్త Dh40 బిలియన్ల మాస్టర్ప్లాన్డ్ తీరప్రాంత కమ్యూనిటీగా ప్రకటించారు. 2.7 మిలియన్ చదరపు మీటర్ల ద్వీపంలో 6,000 కంటే ఎక్కువ హై-ఎండ్ గృహాలు, 10 కి.మీ ఫిట్నెస్ కారిడార్, 4.6 కి.మీ బీచ్లు, ప్రత్యేక వాటర్ఫ్రంట్ ప్రొమెనేడ్ ఉంటాయి.
ఇది అబుదాబిలో మొట్టమొదటి తీరప్రాంత వెల్నెస్ ద్వీపంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఫిట్వెల్ సర్టిఫికేషన్ పొందింది. ఇది ప్రపంచ ఆరోగ్యకరమైన భవన ప్రమాణాలను చేరుకున్న ప్రపంచంలోనే మొదటి ద్వీపంగా నిలిచింది.
యాస్, సాదియత్ దీవుల మధ్య ఉన్న ఫాహిద్ ద్వీపం.. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అబుదాబిలోని విశ్రాంతి, సాంస్కృతిక , విమానయాన కేంద్రాలకు కనెక్టివ్ గా ఉంటుంది. వీటి మధ్య ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలు అని అల్దార్ తెలిపింది. విదేశీ పెట్టుబడిదారుల నుండి అద్భుతమైన డిమాండ్ ఉందని అల్దార్ గ్రూప్ సీఈఓ తలాల్ అల్ ధియేబి తెలిపారు. అబుదాబిలో ప్రారంభించిన అతిపెద్ద మల్టీ యూజ్ వినియోగ నివాస మాస్టర్ప్లాన్లలో ఫాహిద్ ద్వీపం ఒకటి అని అన్నారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







