మైనర్లకు ఈ-స్కూటర్లను ఇస్తున్నారా?
- June 02, 2025
యూఏఈ: యూఏఈలో లైసెన్స్ లేకుండా ఎలక్ట్రిక్ బైక్లు, ఈ-స్కూటర్లను నడిపే టీనేజర్ల సంఖ్య పెరుగుతోంది. మైనర్లు రద్దీగా ఉండే రోడ్లు, ట్రాఫిక్ లేన్లలో తక్కువ లేదా అనుభవం లేకుండా, తరచూ ట్రాఫిక్ చట్టాలను విస్మరిస్తూ..తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా తిరుగుతున్నారు. దీనిపై యూఏఈ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూఏఈలో ఇ-స్కూటర్లు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు జనరేషన్ ఆల్ఫాలో ఎలక్ట్రిక్ బైక్లు తాజా ట్రెండ్గా మారాయి. తల్లిదండ్రుల తెలిపిన ప్రకారం.. చాలా మంది పిల్లలు తమ ఈ బైక్లను బహుమతులుగా అభ్యర్థిస్తున్నారు. చాలా మంది యువ రైడర్లు తమను తాము ప్రమాదంలో పడేయడమే కాకుండా డ్రైవర్లకు కూడా అంతరాయం కలిగించే నిర్లక్ష్య ప్రవర్తనను కలిగి ఉంటున్నారని పేర్కొన్నారు.
దుబాయ్లోని అధికారులు తమ పిల్లలు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తే తల్లిదండ్రులు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. 'క్రైమ్ అండ్ లెసన్' సిరీస్లో భాగంగా.. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 13 ఏళ్ల బాలిక తన ఇ-స్కూటర్పై రోడ్డు దాటుతుండగా గాయపడిన కేసును హైలైట్ చేసింది. అకాడమిక్ లో చూపి మంచి పనితీరుకు మెచ్చి ఆమె తండ్రి ఆమెకు స్కూటర్ను బహుమతిగా ఇచ్చాడని అనంతరం విచారణలో తేలింది. పేరెంట్స్ పై కేసు నమోదు చేసి కోర్టు ముందు నిలబెట్టారు.
2024లో దుబాయ్ 254 ఇ-స్కూటర్ , సైకిల్ సంబంధిత ప్రమాదాలు నమోదయ్యాయి. ప్రమాదాల కారణంగా 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు. 2025లో ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఫిబ్రవరిలో కేవలం మూడు రోజుల్లోనే రెండు ఇ-స్కూటర్ సంబంధిత మరణాలు సంభవించాయి. 15, 9 సంవత్సరాల వయస్సు గల మైనర్లు ప్రమాదంలో మరణించడం అందరిని కదిలిచింది.
దుబాయ్ లో ఈ-స్కూటర్, ఇ-బైక్ వాడకంపై కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది. ఇందులో కనీస రైడర్ వయస్సు 16 సంవత్సరాలుగా నిర్ణయించారు. పర్యవేక్షణకు అధికారులు ప్రత్యేక వ్యక్తిగత మొబిలిటీ మానిటరింగ్ యూనిట్ను ప్రారంభించారు. ట్రాఫిక్ భద్రతను మెరుగుపరిచారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం రైడర్లు నిర్దేశించిన లేన్లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. బ్యాలెన్స్ తప్పించే వస్తువులను రవాణా చేయవద్దు. ట్రాఫిక్కు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రయాణించవద్దు. ఎల్లప్పుడూ హెల్మెట్లు, తగిన రక్షణ గేర్లను ధరించాలి. పాదచారుల నడక మార్గాలతో సహా నిషేధిత ప్రాంతాలలో ప్రయాణించడం ఉల్లంఘనల కిందకు వస్తుంది. నిబంధనలు పాటించని వందలాది ఇ-స్కూటర్లు, సైకిళ్లను ప్రతి నెలా స్వాధీనం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







