తెలంగాణ ప్రభుత్వ యోచన..

- July 12, 2016 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వ యోచన..

 21 ఏళ్లలోపు వారికి మద్యం సరఫరా చేసే బార్లు, వైన్‌షాపులపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఎక్సైజ్‌ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. పంజాగుట్టలో జరిగిన రోడ్డుప్రమాదంలో చిన్నారి రమ్య మృతి చెందిన ఘటనపై ఈ సమావేశంలో చర్చించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థి మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. మద్యం సరఫరాపై సమీక్షించారు. బార్లపై నిఘా కఠినతరం చేయాలని, ప్రతి బార్‌లోనూ సీసీ కెమెరా తప్పనిసరి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం
టీజీఐ బార్‌పై కేసు నమోదు 
బంజారాహిల్స్‌లోని టీజీఐ బార్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ఇంజినీరింగ్‌ విద్యార్థులు టీజీఐ బార్‌లోనే మద్యం సేవించినట్లు తేలడంతో.. మైనర్లకు మద్యం సరఫరా చేసిన నేరంపై కేసు నమోదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com