వికలాంగులకు కేటాయించిన స్థలంలో పార్కింగ్.. ఒక నెల జైలు శిక్ష..!!
- June 04, 2025
కువైట్: వికలాంగుల కోసం కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసినందుకు ఒక వ్యక్తి దోషిగా తేలిన తర్వాత ట్రాఫిక్ మిస్డిమీనర్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. అతని డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేసింది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల హక్కులను పరిరక్షించడంలో కఠినంగా వ్యవహారిస్తామని కోర్టు తెలిపింది.
ఏప్రిల్ 22 నుండి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రాకముందే ఉల్లంఘన జరిగినందున, వికలాంగుల హక్కులపై 2010 నాటి చట్టం నంబర్ 8 ఆధారంగా కోర్టు తన తీర్పును ప్రకటించింది. ఈ చట్టంలోని ఆర్టికల్ 63 ప్రకారం, వికలాంగుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించే ఎవరైనా ఒక నెల వరకు జైలు శిక్ష, KD 100 వరకు జరిమానా లేదా రెండింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది.
సవరించబడిన ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 33 బిస్ ప్రకారం.. ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు KD 600 నుండి KD 1,000 వరకు జరిమానాలు ఉన్నాయి. వికలాంగుల కోసం ఉద్దేశించి సౌకర్యాల దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కోర్టు వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







