దుబాయ్ లో 500 ఫోన్లు చోరీ..ముఠాకు జైలుశిక్ష, జరిమానా..!!

- June 07, 2025 , by Maagulf
దుబాయ్ లో 500 ఫోన్లు చోరీ..ముఠాకు జైలుశిక్ష, జరిమానా..!!

దుబాయ్: నైఫ్‌లోని ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణం నుండి 496 స్మార్ట్‌ఫోన్‌లను దొంగిలించినందుకు ఆరుగురు ఆసియా వ్యక్తులకు దుబాయ్‌లోని ఒక క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు Dh541,000 జరిమానాను కూడా కోర్టు విధించింది. నిందితులలో నలుగురిని విచారించి వ్యక్తిగతంగా శిక్ష విధించగా, మరో ఇద్దరు గైర్హాజరీలో దోషులుగా నిర్ధారించారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసు ఈ సంవత్సరం జనవరిలో జరిగింది. నిందితులను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 236 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com