యాత్రికుల తిరిగి వెళ్లేందుకు విస్తృత ఏర్పాట్లు: పాస్పోర్ట్స్ డైరెక్టరేట్
- June 10, 2025
మక్కా: హజ్ కోసం వచ్చిన యాత్రికులు తిరిగి క్షేమంగా వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాస్పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఆధునిక భద్రతా వ్యవస్థల మద్దతుతో తమ సిబ్బందిని, టెక్నాలజీని సన్నద్ధం చేసినట్లు డైరెక్టరేట్ పేర్కొంది.
మరోవైపు, ఈ సంవత్సరం హజ్ చేసిన తర్వాత ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వదేశాలకు తిరిగి వెళ్లే యాత్రికులను ఆహ్వానించడం ప్రారంభించాయి.కాగా, హజ్ చేసిన తర్వాత, పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రవక్త మసీదులో ప్రార్థన చేయడానికి మదీనాకు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోని హజ్, విజిట్ కమిటీ, సంబంధిత సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి.
మొత్తంగా ఎయిర్స్ పోర్ట్స్ ద్వారా 719,400 మంది యాత్రికులు రాగా.. అలాగే రాజ్యానికి ఫ్లైట్స్ ద్వారా వచ్చే యాత్రికులలో వీరిది 49 శాతంగా ఉంది. ఈ యాత్రికులు ఏప్రిల్ 29 నుండి 65 విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 53 దేశాలలోని 196 నగరాల నుండి 1,910 విమానాలలో వచ్చారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







