E311లో స్కూల్ బస్సులు ఢీ..13aకు పెరిగిన గాయపడ్డ స్టూడెంట్స్ సంఖ్య..!!
- June 10, 2025
యూఏఈ: ఈద్ అల్ అధా సెలవుల తర్వాత విద్యార్థులు పాఠశాలకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు రెండు స్కూల్ బస్సులు ఢీకొన్నాయి. ఇందులో 13 మంది విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి E311 పై జరిగింది. జూన్ 9న మధ్యాహ్నం 3.11 గంటలకు ఈ సంఘటన గురించి అత్యవసర కాల్ అందిందని నేషనల్ అంబులెన్స్ తెలిపింది. అత్యవసర వైద్య బృందాలు 13 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. గాయపడిన విద్యార్థులు 6 -12 సంవత్సరాల మధ్య వయస్సు వారని తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, వేగాన్ని నివారించాలని కోరారు. తీవ్రమైన ఉల్లంఘనలకు Dh200,000 వరకు జరిమానాతో కఠినమైన శిక్షలు అమలులో ఉన్నాయని గుర్తుచేశారు.
కాగా, దుబాయ్లో పాఠశాల బస్సు ఆపరేటర్లు, రవాణా సంస్థలు విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి డ్రైవర్లకు సమగ్ర శిక్షణ అందించడం తప్పనిసరి. షార్జాలో తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలకు తిరిగి వెళ్లేటప్పుడు వారిని పర్యవేక్షించడానికి వీలుగా 2,000 బస్సులలో కెమెరాలు, భద్రతా పరికరాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









