రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్
- June 10, 2025
చెన్నై: తమిళనాడు : తమిళ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 6 స్థానాలకు గాను 4 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు డిఎంకే ప్రకటించింది.
ఒక స్థానాన్ని మిత్రపక్షమైన MNM కు కేటాయించగా.. కమల్ ఆ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే కమల్ హాసన్ తో పాటు మిగిలిన డీఎంకే సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. కాగా రాజ్యసభలోకి కమల్ ఎంట్రీతో MNM పార్టీకి మరింత రాజకీయ ప్రాధాన్యత పెరగనుంది. అలాగే తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు పెద్దల సభలో తమిళ గళాన్ని మరింత గట్టిగా వినిపించేందుకు DMK-MNM సిద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









