రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్
- June 10, 2025
చెన్నై: తమిళనాడు : తమిళ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 6 స్థానాలకు గాను 4 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు డిఎంకే ప్రకటించింది.
ఒక స్థానాన్ని మిత్రపక్షమైన MNM కు కేటాయించగా.. కమల్ ఆ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే కమల్ హాసన్ తో పాటు మిగిలిన డీఎంకే సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. కాగా రాజ్యసభలోకి కమల్ ఎంట్రీతో MNM పార్టీకి మరింత రాజకీయ ప్రాధాన్యత పెరగనుంది. అలాగే తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు పెద్దల సభలో తమిళ గళాన్ని మరింత గట్టిగా వినిపించేందుకు DMK-MNM సిద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..