రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్
- June 10, 2025
చెన్నై: తమిళనాడు : తమిళ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 6 స్థానాలకు గాను 4 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు డిఎంకే ప్రకటించింది.
ఒక స్థానాన్ని మిత్రపక్షమైన MNM కు కేటాయించగా.. కమల్ ఆ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే కమల్ హాసన్ తో పాటు మిగిలిన డీఎంకే సభ్యుల ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. కాగా రాజ్యసభలోకి కమల్ ఎంట్రీతో MNM పార్టీకి మరింత రాజకీయ ప్రాధాన్యత పెరగనుంది. అలాగే తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపును తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు పెద్దల సభలో తమిళ గళాన్ని మరింత గట్టిగా వినిపించేందుకు DMK-MNM సిద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







