ఈ నెల 13 నుంచి విశాఖ-అబుదాబి విమాన సర్వీస్
- June 11, 2025
విశాఖపట్నం నుంచి నేరుగా అబుదాబికి ప్రయాణించాలనుకునే ప్రయాణికుల కోసం శుభవార్త. జూన్ 13వ తేదీ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ నూతన అంతర్జాతీయ విమాన సర్వీస్ను ప్రారంభించనుంది.ఈ సర్వీస్ ప్రారంభం ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కలగనుంది. ఇప్పటికే విశాఖ నుంచి దుబాయ్, సింగపూర్లకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు అబుదాబికి కూడా నేరుగా వెళ్లే అవకాశం ఏర్పడింది.
ఈ నూతన విమాన సర్వీస్ వారానికి నాలుగు రోజులు..సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం — అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఉదయం 9:45 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12:35 గంటలకు అబుదాబికి చేరుకుంటుంది. అదే విమానం అక్కడి నుంచి మధ్యాహ్నం 2:35కు బయలుదేరి సాయంత్రం 4:00 గంటలకు విశాఖకు తిరిగి వస్తుంది. ఈ షెడ్యూల్ వ్యాపార ప్రయాణికులు, ఉద్యోగులు, పర్యాటకులకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది.
విశాఖపట్నం నుంచి అబుదాబికి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమవడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు పెరగటంతో పాటు, ప్రవాసాంధ్రులకు ఇదొక పెద్ద ఊరటగా నిలవనుంది. విమాన సర్వీసుల పెంపుతో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం మరింత ఆవిర్భవించనుంది.
తాజా వార్తలు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!









