ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- June 13, 2025
మస్కట్: ఇరాన్పై ఇజ్రాయెల్ నిర్వహించిన దారుణమైన సైనిక దురాక్రమణను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇది సార్వభౌమ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని పౌరుల ప్రాణనష్టానికి కారణమైందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను ప్రమాదకరమైన, ఘోరమైన నిర్లక్ష్యమైన చర్యగా ఒమన్ పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టంలోని సూత్రాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ స్పష్టమైన ఉల్లంఘనను సూచిస్తుందని తెలిపింది. ఇటువంటి దూకుడు, ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి ధోరణి ప్రాంతీయ శాంతి, భద్రతను మరింత అస్థిరపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ ప్రవర్తన దౌత్య పరిష్కారాలను అణగదొక్కడానికి..ప్రాంతీయ భద్రత స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఒమన్ పేర్కొంది. ఈ ప్రమాదకరమైన చర్యను ఆపడానికి అంతర్జాతీయ సమాజం కలిసి రావాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..







